Accident: తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరూర్ జిల్లా వెన్నమలై వద్ద టూరిస్ట్ వ్యాన్, ట్రావెల్స్ బస్సు ఢీకొని నలుగురు మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు.
కాగా సేలం నుంచి కరూర్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు వెన్నమలై వద్ద టూరిస్ట్ వ్యాన్ ను ఢీకొంది. వీరంతా తూత్తుకుడి నుంచి ఓ ట్రిప్ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు చనిపోగా.. 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కరూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శనివారం తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కరూర్- సేలం హైవేపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి నాగర్ కోయిల్ వెళ్తోంది. బస్సు అతివేగంతో వెళ్తూ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు ఆరా తీస్తున్నారు.