Indian DGMO Brief: జరిగిన నష్టాన్ని పాక్ చెప్పుకోవడం లేదు: భారత డీజీఎంవో

Indian DGMO Briefed how India Attack Pakistan: ఎలాంటి ఆపరేషన్కైనా సిద్ధంగా ఉన్నామని భారత డీజీఎంవో తెలిపారు. మన బహుళ రక్షణ వ్యవస్థను దాటే సామర్థ్యం పాక్కు లేదని తెలిపారు. ఫైటర్లు, నిఘా విమానాలు కాపలా కాస్తున్నాయని.. జరిగిన నష్టాన్ని పాక్ చెప్పుకోవడం లేదని అన్నారు. చైనా తయారీ చేసిన పీఎల్-15 మిస్సైళ్లతో పాకిస్తాన్ దాడి చేసిందని.. వాటిని ఆకాశ్ క్షిపణులతో నిర్వీర్యం చేశామని తెలిపారు. మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం వాళ్లపై దాడి చేస్తున్నామని భావిస్తోందని అన్నారు.
ఉగ్రవాదులతోపాటు, వారికి సహాయంచేసే వారే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ ఉంటుంది. మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నామన్నా్ం. వివిధ రకాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో పాకిస్తాన్ను దీటుగా ఎదుర్కొన్నాం. చైనా తయారీ చేసిన పీఎల్-15 మిస్సైళ్లతో పాకిస్తాన్ దాడి చేసింది. వాటిని మనం ఆకాశ్ క్షిపణులతో నిర్వీర్యం చేశాం. పాక్ వివిధ రకాల డ్రోన్లను వినియోగించింది. అయినా మనం దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో డ్రోన్లను అడ్డుకున్నాం.
పాక్లోని నూర్ఖాన్ ఎయిర్బేస్పై దాడి చేశాం. నూర్ఖాన్ ఎయిర్బేస్ రన్వేకు తీవ్రనష్టం జరిగింది. కొన్నేళ్లుగా ఉగ్రవాదులు వ్యూహాలను మార్చుకుంటున్నారు. సైనికులతోపాటు యాత్రికులు, భక్తులను టార్గెట్ చేస్తున్నారు. మల్టీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకొని పాక్ మన వైమానిక స్థావరాలను ధ్వంసం చేయలేకపోయింది. ఈ నెల 9, 10 తేదీల్లో పాక్ మన వైమానిక స్థావరాలను టార్గెట్ చేసింది.
ఫైటర్లు, నిఘా విమానాలు కాపలా కాస్తున్నాయి. అత్యాధునిక రాడార్లతో మన నిఘా వ్యవస్థ ఉంది. మన బహుళ రక్షణ వ్యవస్థను దాటే సామర్థ్యం పాక్కు లేదు. పాక్ సామాన్య పౌరులకు ఎలాంటి నష్టం జరగలేదు. శుత్రు విమానాలు మన దేశంలో రాకుండా అడ్డుకున్నాం. మన సైనిక స్థావరాలు సిద్ధంగా ఉన్నాయి. జరిగిన నష్టాన్ని పాక్ చెప్పుకోవడం లేదన్నారు.