Last Updated:

GSB seva mandal insurance: వినాయకుడికి రూ.316 కోట్ల బీమా

ముంబైలోని అత్యంత సంపన్నమైన గణేష్ మండపాల్లో ఒకటైన జీఎస్బీ సేవా మండల్ వినాయకచవితి సందర్బంగా 316.40 కోట్ల రూపాయల బీమాను తీసుకుంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే 10 రోజుల ఉత్సవాల కోసం అన్ని ప్రజా బాధ్యతలు మరియు మండలాన్ని సందర్శించే ప్రతి భక్తుడు బీమా పరిధిలోకి వస్తారని

GSB seva mandal insurance: వినాయకుడికి రూ.316 కోట్ల బీమా

Mumbai: ముంబైలోని అత్యంత సంపన్నమైన గణేష్ మండపాల్లో ఒకటైన జీఎస్బీ సేవా మండల్ వినాయకచవితి సందర్బంగా 316.40 కోట్ల రూపాయల బీమాను తీసుకుంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే 10 రోజుల ఉత్సవాల కోసం అన్ని ప్రజా బాధ్యతలు మరియు మండలాన్ని సందర్శించే ప్రతి భక్తుడు బీమా పరిధిలోకి వస్తారని ముంబైలోని కింగ్స్ సర్కిల్‌లో ఉన్న జీఎస్బీ సేవా మండల్ చైర్మన్ విజయ్ కామత్ తెలిపారు. రూ. 316.4 కోట్ల విలువైన బీమాలో బంగారం, వెండి మరియు ఇతర విలువైన వస్తువులకు రూ. 31.97 కోట్ల కవరేజీ, పండల్, వాలంటీర్లు, పూజారులు, కుక్‌లు, ఫుట్‌వేర్ స్టాల్ వర్కర్లు, వాలెట్ పార్కింగ్ వ్యక్తులు మరియు సెక్యూరిటీ గార్డులకు రూ.263 కోట్ల వ్యక్తిగత బీమా ఉంది.

రూ.కోటి రూపాయలకు స్టాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్ పాలసీతో పాటు భూకంప ప్రమాదంతో ఫర్నిచర్, ఫిక్చర్‌లు, ఫిట్టింగ్‌లు, కంప్యూటర్లు, సీసీటీవీలు మరియు స్కానర్‌ల వంటి ఇన్‌స్టాలేషన్‌లను కవర్ చేసినట్లు కామత్ తెలిపారు. మేము అత్యంత క్రమశిక్షణ కలిగిన గణేష్ మండల్, కాబట్టి బప్పా (గణేష్ లార్డ్) యొక్క ప్రతి భక్తుడిని సురక్షితంగా ఉంచడం మా బాధ్యత అని కామత్ చెప్పారు.

ఇవి కూడా చదవండి: