Operation Sindoor: భారత్ దాడులు.. అమెరికా కీలక హెచ్చరిక

America: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులకు పాల్పింది. పాక్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
అయితే భారత్ కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటే.. పాకిస్తాన్ మాత్రం భారత్ కు తగిన బదులు చెప్తామని అంటోంది. దీంతో భారత్ సరిహద్దు వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ లోని పలు ప్రాంతాలపై మిస్సైల్స్, డ్రోన్స్ తో దాడి చేసింది. కాగా పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్స్, మిస్సైల్స్, మోటర్లను భారత్ విచ్ఛిన్నం చేసింది. కాగా దాడులకు ప్రతిగా భారత్ ధీటైన సమాధానం ఇచ్చింది.
పాకిస్తాన్ లోని కీలక ప్రాంతాలపై డ్రోన్ తో చెలరేగిపోయింది. లాహోర్, కరాచీ, రావల్పిండి ప్రాంతాల్లో దాడులు చేసింది. అలాగే లాహోర్ లోని హెచ్ క్యూ-9 డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది. డ్రోన్స్, బాంబులతో విరుచుకపడింది. ఇక భారత్ చేస్తున్న దాడులతో పాకిస్తాన్ కకావికలమవుతోంది. భారత్ ప్రయోగిస్తున్న అత్యాధునిక డ్రోన్స్, క్షిపణులను పాకిస్తాన్ ఆర్మీ ఎదుర్కోలేక పోతోంది. రావల్పిండిలో క్రికెట్ స్టేడియంపై డ్రోన్స్ తో దాడి చేసింది. దాడుల్లో క్రికెట్ స్టేడియంలోని కొంత భాగం దెబ్బతింది.
ఇక భారత్ చేస్తున్న దాడులపై అమెరికా స్పందించింది. పాకిస్తాన్ యూఎస్ ఎంబసీలోని ఉద్యోగులు, పౌరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించింది. పరిస్థితులు సద్దుమణిగే వరకు అక్కడే ఉండాలని ఆదేశించింది.