Published On:

India Pakistan War: పాకిస్థాన్ నగరాలపై భారత్ దాడి..!

India Pakistan War: పాకిస్థాన్ నగరాలపై భారత్ దాడి..!

India  Pakistan War Updates: పాకిస్థాన్ ను భారత్ చావు దెబ్బ కొట్టింది. పాక్ డ్రోన్ దాడులకు ప్రతీకారంగా భారత్ దాడి చేసింది. ఎయిర్ టు సర్ ప్రైజ్ మిస్సైల్స్ తో 5 నగరాలపై ఇండియా విరుచుకుపడింది. లాహోర్, ఇస్తామాబాద్, రావల్పిండిపై అటాక్ చేసింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై మిసైల్ దాడి చేసింది. మూడు ఎయిర్ బేస్ లపై దాడి జరిగినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. రావల్పిండిలో వరుసగా మూడు చోట్ల భారత్ దాడికి దిగింది. దీంతో పాకిస్తాన్ అన్ని విమానాలను రద్దు చేసింది.

 

ఆపరేషన్ సిందూర్ 2.O కొనసాగుతోంది. పాక్‌పై క్షిపణులతో భారత్ దాడులు చేసింది. పాక్ పట్టణాలను భారత్ టార్గెట్ చేసింది. పెషావర్, నరోవాల్, షేక్‌పురాపై భారత్ అటాక్ చేసింది. పాక్ పట్టణాలు పేలుళ్లతో దద్ధరిల్లుతున్నాయి. రావల్పిండిలో 3 చోట్ల భారీ పేలుళ్లు జరిగాయి. ఇస్లామాబాద్‌లోనూ భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పంజాబ్ ఎయిర్ బేస్‌, మురీద్, రఫికీ, నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌లపై దాడులు జరిగాయి. మ.12 గంటల వరకు ఎయిర్ స్పేస్‌లు క్లోజ్ అవ్వనున్నాయి.

 

ఇవి కూడా చదవండి: