Painting on Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంపై కోటేష్ పెయింటింగ్..!
Artist Chintalapalli Kotesh Painting on Ahmedabad Plane Crash: నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంపై స్పందించి ఒక ఉహాచిత్రాన్ని వాటర్ కలర్ పెయింటింగ్స్ వేశారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ.. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన చాలా బాధాకరమన్నారు. ఈ ఘటన ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపిందన్నారు.. తాను వేసిన ఈ చిత్రంలో విమాన ప్రమాదంలో ఎగిసిన మంటల్లో భయందోళనతో అర్తనాదాలతో , గుర్తుపట్టలేని మృతదేహాలు, తెగిన శరీర భాగాలు, రక్తపు మాంసపు ముద్దలు ఇంతమందికి చావుకు కారణమైన బోయింగ్ విమానంలోని ఎన్నో చిత్రంలో చూపించారు.ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చిత్రకారుడు కోటేష్ కోరారు.