Last Updated:

Manipur violence cases: మణిపూర్ హింసాకాండ కేసుల విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసిన సీబీఐ

మణిపూర్ హింసాకాండకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు కేసులను విచారించేందుకు డీఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సీబీఐ 10 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.

Manipur violence cases: మణిపూర్ హింసాకాండ కేసుల విచారణకు  సిట్‌ను ఏర్పాటు చేసిన  సీబీఐ

Manipur violence cases: మణిపూర్ హింసాకాండకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు కేసులను విచారించేందుకు డీఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సీబీఐ 10 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.

ఆరు  కేసులపై సీబీఐ దర్యాప్తు.. (Manipur violence cases)

మణిపూర్ పర్యటన సందర్భంగా, హోం మంత్రి అమిత్ షా ఆరు  కేసులపై సీబీఐ దర్యాప్తును ప్రకటించారు. ఐదు నేరపూరిత కుట్రపై మరియు మణిపూర్‌లో హింస వెనుక సాధారణ కుట్రపై ఒకటి దర్యాప్తు జరుగుతుంది. రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకోవడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) జాయింట్ డైరెక్టర్ ఘన్‌శ్యామ్ ఉపాధ్యాయ్‌ను పంపించి, తిరిగి వచ్చిన తర్వాత, సిట్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.కోల్‌కతాలోని స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ ఈ కేసులను విచారించనుందని వారు తెలిపారు.

నిర్వాసితుల కోసం ప్యాకేజీ..

మణిపూర్‌లోని నిర్వాసితుల కోసం సహాయ ప్యాకేజీకి కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపింది. జూన్ 1న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేసిన ఒక రోజు తర్వాత, జూన్ 2న మణిపూర్‌లోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 140 ఆయుధాలు అప్పగించారు. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైటీల డిమాండ్‌కు వ్యతిరేకంగా మే 3న కొండ జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించడంతో రాష్ట్రంలో హింస చెలరేగింది. ఒక నెల క్రితం జాతి హింస చెలరేగినప్పటి నుండి ఇప్పటివరకు, దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోగా 300 మందికి పైగా గాయపడ్డారు.రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ నుండి కుకి గ్రామస్థులను ఖాళీ చేయించడంతో ఉద్రిక్తతలు రేగి ఘర్షణలు జరిగాయి, ఇది చిన్న చిన్న ఆందోళనలకు దారితీసింది.

మణిపూర్ జనాభాలో మైటీలు దాదాపు 53 శాతం ఉన్నారు. వీరు ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు. గిరిజనులయిన నాగాలు మరియు కుకీలు జనాభాలో మరో 40 శాతం ఉన్నారు. వీరు కొండ జిల్లాలలో నివసిస్తున్నారు.శాంతిభద్రతల పరిరక్షణ కోసం దాదాపు 10,000 మంది ఆర్మీ, అస్సాం రైఫిల్స్ సిబ్బందిని రాష్ట్రంలో మోహరించారు.