Home / CBI
హీరో విశాల్ నుంచి 7 లక్షలు లంచం తీసుకున్నందుకు గాను గుర్తుతెలియని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ( సిబిఎఫ్సి ) ఉద్యోగులు, మరో ముగ్గురు వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది.ముగ్గురు నిందితులను మెర్లిన్ మేనగా, జీజా రాందాస్, రాజన్ ఎంలుగా గుర్తించగా, మిగతా వారి పేర్లు వెల్లడించలేదు.
16 సంవత్సరాల తరువాత ఇబ్రహీంపట్నం బిఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్య కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ కేసులో పోలీసులకి రిపోర్టు ఇచ్చిన పూసపాటి వెంకట కృష్ణప్రసాద్ని విచారణకి హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు.
మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) శనివారం అధికారికంగా విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత సీబీఐకి కీలక విషయాలు వెల్లడించింది. వివేకా హత్య కేసు ఛార్జిషీట్తోపాటు సునీత ఇచ్చిన వాంగ్మూలాలని సునీత వాంగ్మూలాలను సిబిఐ కోర్టుకు సమర్పించింది. ఇంటికొచ్చి కలుస్తానంటూ 2019 మార్చి 22న వైఎస్ భారతి ఫోన్ చేశారు సునీత చెప్పారు
బాలాసోర్ రైలు ప్రమాదంపై విచారణ జరుపుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోమవారం బాలాసోర్లోని సోరో సెక్షన్ సిగ్నల్ జూనియర్ ఇంజనీర్ ఇంటికి సీలు వేసింది. బాలాసోర్లోని అద్దె ఇంట్లో నివసించిన ఇంజనీర్ను దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. అయితే అతను ఇప్పుడు తన కుటుంబంతో అదృశ్యమయ్యాడు.
తమిళనాడు ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ రాకుండా తలుపులు మూసి వేసింది. తమిళనాడులోని ఏ కేసుకు సంబంధించైనా దర్యాప్తు చేసుకునేందుకు గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని స్టాలిన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది.
మణిపూర్ హింసాకాండకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు కేసులను విచారించేందుకు డీఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సీబీఐ 10 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మారిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని ఎనిమిదో నిందితుడుగా చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గత శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు చేయడానికి ఒక బృందం మంగళవారం ప్రమాద స్థలానికి చేరుకుంది.మానవ తప్పిదాలు లేదా ప్రమాదానికి కారణమయ్యే ఉద్దేశపూర్వక ప్రయత్నాలతో సహా అన్ని కారణాలను పరిశీలిస్తుంది.
ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ కొనుగోళ్ల ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై బ్రిటిష్ ఏరోస్పేస్ కంపెనీ రోల్స్ రాయిస్, దాని ఎగ్జిక్యూటివ్లు మరియు ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్తలపై సీబీఐ సోమవారం కేసు నమోదు చేసింది.