Published On:

Boycott Turkey: భారత్ లో టర్కీ విక్రయాలు ఆపేసిన AJIO, MYNTRA

Boycott Turkey: భారత్ లో టర్కీ విక్రయాలు ఆపేసిన AJIO, MYNTRA

Boycott Turkey: భారత్ లో టర్కీ విక్రయాలను AJIO, MYNTRA ఆపేసాయి. తమ వెబ్ పోర్టల్ నుంచి టర్కీ ప్రాడక్ట్ లను తీసివేశాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ పై భారత్ చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో టర్కీ పాక్ కు సపోర్ట్ గా నిలిచింది. పాకిస్తాన్ కు ఆయుధాలు సరఫరా చేసింది. దీంతో టర్కీపై దౌత్యపరమైన చర్యలు తీసుకుంది భారత్. దాంతో పాటే భారత వ్యాపారులు కూడా టర్కీతో వ్యాపార సంబంధాలు తెంచుకున్నారు.

పాకిస్తాన్ లోని ఉగ్రవాదులను వారి స్థావరాలను ద్వంసం చేయడంలో భాగంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్తాన్ భారత్ పైకి క్షిపణులను కురిపించింది. అలాంట పరిస్థితుల్లో టర్కీ  పాకిస్తాన్ కు  తన వద్ద ఉన్న క్షిపణులను  ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ టర్కీ ఇచ్చిన డ్రోన్ లను క్షిపణులను భారత్ పై ప్రయోగించింది. ఈ దాడిని భారత్ సునాయాసంగా కూర్చున్నచోటనే తిప్పికొట్టింది. భారత్ శక్తిని తెలుసుకున్న టర్కీ జారుకుంది.

 

కార్గిల్ యుద్ద సమయంలో కూడా టర్కీ భారత్ కు వ్యతిరేకంగా పనిచేసింది. అలాంటి, టర్కీలో భూకంపం సంభవిస్తే ఆదేశపు ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు ప్రపంచంలో ఏదేశం స్పందించనప్పుడు భారత్ మొదటగా స్పందించి టర్కీకి ఆహారంతో పాటు డాక్టర్లను, కావలసిన మందులను సరఫరా చేసింది. భారత డాక్టర్లు కొన్నిరోజులు అక్కడే ఉండి టర్కీ ప్రజలకు వైద్యం అందించారు. ఇవన్నీ పోగా భారత్ ఉగ్రవాదంపై పాకిస్తాన్ తో పోరాడుతున్నప్పుడు ఉగ్రవాదానికి, పాకిస్తాన్ కు సపోర్ట్ గా టర్కీ యుద్దానికి వచ్చింది. పాముకు పాలుపోసి పెంచినా టర్కీకి సహాయం చేసినా ఒకటేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.