Corona Virus: 3 వేలు దాటిన కరోనా కేసులు.. 29కి చేరిన మృతుల సంఖ్య

Corona Virus Cases Increased in India: కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇక, భారత్లో కోవిడ్ 19 చాపకింద నీరులా విస్తరిస్తుంది. ప్రస్తుతం కోవిడ్ 19 కేసుల సంఖ్య 3వేలకు చేరుకున్నాయి. మొత్తం 3,395 యాక్టివ్ కేసులు ఉండగా.. అత్యధికంగా కేరళలోనే1,336 కేసులు ఉండడం విశేషం.
దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 84 కేసులు నమోదవ్వగా.. ప్రస్తుతం 681 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దేశంలో మొత్తం కేసుల్లో 60 శాతానికిపైగా కేసులు కేరళ, మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.
ఇక, కరోనా కారణంగా ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 29కి చేరింది. కర్ణాటకలో ఇటీవల ఓ వృద్ధుడు కరోనా రావడంతో శ్వాస అందక మృతి చెందాడు. తాజాగా, మహారాష్ట్రలో ఆరుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 29కు చేరింది. అంతకుముందు ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, తమిళనాడులో కరోనాతో చనిపోయారు. అలాగే మిజోరంలో 7 నెలల తర్వాత తొలి కేసు నమోదైంది.