Published On:

Plane Crash : ఘోర ప్రమాదం.. మేఘానిలో కూలిన ఎయిర్‌ ఇండియా విమానం

Plane Crash : ఘోర ప్రమాదం.. మేఘానిలో కూలిన ఎయిర్‌ ఇండియా విమానం

Plane crash in Ahmedabad : గుజరాత్‌‌లోని అహ్మదాబాద్‌‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘానిలో ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానం కుప్పకూలింది. టేకాఫ్‌ అయిన నిమిషాల్లో సివిల్‌ ఆసుపత్రి సమీపంలో విమానం కూలినట్లు జాతీయ మీడియా వెల్లడించాయి.

 

ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం అనంతరం ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. విమానం అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్తున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

కూలిన విమానంలో గుజ‌రాత్ మాజీ సీఎం..
అహ్మ‌దాబాద్‌లో కూలిన విమానంలో గుజ‌రాత్ మాజీ ముఖ్యమంత్రి విజ‌య్ రూపానీ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇంకా పూర్తి స‌మాచారం అందాల్సి ఉన్న‌ది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో రూపానీ లండ‌న్ వెళ్తున్న‌ట్లు స‌మాచారం. ఫ్ల‌యిట్ రేడార్ 24 త‌న ‘ఎక్స్‌’లో విమానం కూలినట్లు పోస్టు చేసింది. 08:08:51 యూటీసీ స‌మ‌యంలో త‌మ‌కు చివ‌రి సిగ్న‌ల్ అందిన‌ట్లు పేర్కొన్నారు. టేకాఫ్ తీసుకున్న కొన్ని సెక‌న్ల‌లో ఫ్లైట్ కూలిన‌ట్లు చెబుతున్నారు. ఎయిరిండియా ఫ్ల‌యిట్ AI171 కూలిన‌ట్లు తెలుస్తోంది.

`

 

ఇవి కూడా చదవండి: