Home / CM Revanth Reddy
KTR Fires On CM Revanth Reddy: దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండల కేంద్రంలో ఆత్మగౌరవ గర్జన సభ నిర్వహించారు. సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. హైదరాబాద్లో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టింది కేసీఆరే అన్నారు. 26 శాతం ఉన్న దళిత గిరిజనులకు అన్నిరకాలుగా అండగా ఉంటామని మాటిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని దుయ్యబట్టారు. […]
Aadi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. బీజేపీ నేత రఘునందన్ రావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీసీ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు దారుణమని ఆయన ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయాలన్న విషయంలో బీజేపీకి స్పష్టతే లేదు. బీజేపీ నేత రఘునందన్ రావు.. బీసీ బిల్లుపై కేంద్రాన్ని ఒత్తిడి చేయాల్సిందని విమర్శించారు. కానీ, ఆయన అది చేయకుండా కాంగ్రెస్పై విమర్శలు చేయడం దారుణమన్నారు. బీసీ బిల్లు అమలవకూడదని రఘునందన్ రావు కోరుకుంటున్నారని ఆది శ్రీనివాస్ […]
CM Revanth Reddy: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన సీఎంవో అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు […]
AICC: ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ నేతలు రాహుల్ గాంధీని కలిశారు. పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వేపై ప్రశంసలు కురిపించారు. ఇందులో భాగంగా తెలంగాణలో బలహీన వర్గాల సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం 2.0 ఉద్యమాన్ని ప్రారంభించిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ లో ప్రకటించారు. “న్యాయం కోసం రాహుల్ గాంధీ […]
CM Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ అంశంపై సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీలో చిట్చాట్లో సీఎం మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా కుటుంబ సభ్యుల ఫోన్ కూడా విన్నారని అంటున్నారని, సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వినాల్సిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకోవడం ఉత్తమమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదని, కానీ లీగల్గా అనుమతి తీసుకుని చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన […]
CM Revanth Reddy: కులగణన సర్వే ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపించినట్లు చెప్పారు. బిల్లు ఆమోదానికి కేంద్రంలోని విపక్ష కూటమి నేతలను కలిసి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ అంశంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో సెప్టెంబర్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. […]
TGSRTC: గత 10 ఏళ్లలో తెలంగాణ ఆర్టీసీని నిర్వీర్యం చేశారని ఓ సమయంలో ఆర్టీసీ ఉంటుందా? అని కూడా అనుకునే పరిస్థితి ఉండేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందని తెలిపారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు బస్సులకు యజమానులకు చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు బస్సులు కొనుగోలు చేసిందన్నారు. ఆర్టీసీకి ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అండగా ఉంటుందని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. 200 కోట్ల ఉచిత బస్సు […]
CM Revanth Reddy Delhi Tour: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే తెలంగాణలో ఇప్పటికే చేపట్టిన కులగణన సర్వే ఆధారంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలనే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్తో చర్చించనున్నారు. కేంద్రానికి పంపిన రెండు బీసీ బిల్లుల ఆమోదంపై పార్లమెంటులో చర్చ పెట్టాలని ఎంపీలను కోరనున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను కూడా కలిసి ఈ అంశాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో […]
G.O. No 49: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాదాస్పద జీవో నెం. 49 ను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ఈ నిర్ణయంపై స్థానిక ఆదివాసీలలో అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని జీవోను నిలిపివేయాలని ఆధికారులను ఆదేశించారు. ఆదివాసీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, వారి ఆందోళనలను నివృత్తి చేసే వరకు జీవో అమలును నిలిపి ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కన్జర్వేషన్ కారిడార్ వల్ల […]
CM Revanth Reddy Video Conference District Collectors: జిల్లాల్లో ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రోజూ కలెక్టర్లు ఏ పనిచేశారో తనకు తెలియజేయాలన్నారు. వారి కార్యాచరణ రిపోర్టు రోజూ తనకు పంపించాలని సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వానాకాలం పంటసాగు, సీజనల్ వ్యాధులు, రేషన్కార్డుల పంపిణీ తదితర అంశాలపై సీఎం చర్చించారు. తెలంగాణలో సరిపడా ఎరువులు ఉన్నాయని తెలిపారు. […]