Groom Died with Current Shock: కాసేపట్లో రిసెప్షన్.. అంతలోనే కరెంట్ షాక్తో పెళ్లికుమారుడు మృతి!

Groom Died with Current Shock: రిసెప్షన్ కాసేపట్లో ఉండగా ఓ పెళ్లికుమారుడు కరెంట్ షాక్తో మృతి చెందాడు. ఈ మరణ వార్త తెలుసుకున్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తీవ్ర దిగ్భ్రాంతులకు గురయ్యాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బయ్యారం సింగిల్ విండో చైర్మన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండా గ్రామానికి చెందిన ఇస్లావత్ బాలు చిన్న కుమారుడు ఇస్లావత్ నరేష్ వివాహం మే 19న విజయవాడలో ఘనంగా జరిగింది. అయితే ఇవాళ గోడిపుంజుల తండాలో వరుడి ఇంట్లో రిసెప్షన్ ఉంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకునే సమయంలో నీటి కోసం విద్యుత్ మోటరు పంపు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురైన పెళ్లికుమారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పెళ్లి కొడుకు మరణ వార్త తెలుసుకున్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు తీవ్ర దిగ్భ్రాంతులకు గురై ఫోన్ ద్వారా వారి కుటుంబ సభ్యులకు మేము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బయ్యారం సింగిల్ విండో చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, తాడబోయిన ప్రభాకర్, కందుకూరి ప్రదీప్ అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యుల పరామర్శించారు. అనంతరం సంఘటన స్థలానికి పోలీస్ అధికారులకు చేరుకొని సంఘటన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.