Home / crime
Two Nursing Students Died : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బొలేరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన నిలబడిన విద్యార్థినులపైకి వాహనం దూసుకెళ్లింది. దీంతో మక్తల్కు చెందిన మహేశ్వరి, వనపర్తికి చెందిన మనిషా విద్యార్థినులు అక్కడికక్కడే మృతిచెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం సాయంత్రం కొందరు నర్సింగ్ విద్యార్థినులు కళాశాల నుంచి హాస్టల్కు వెళ్లేందుకు బస్టాప్లో నిలబడి ఉన్నారు. విద్యార్థినులపై బొలేరో వాహనం దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో వాహనం డ్రైవర్ పరారయ్యారు. […]
Tirupati Road Accident : ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేండ్రకుంట సమీపంలోని కోనప్ప రెడ్డి పల్లి ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు […]
Father shoots daughter to death with gun : ఓ యువతి తన తండ్రికి ఇష్టంలేని ప్రేమ వివాహం చేసుకున్నది. బంధువుల ఇంట్లో జరిగే వివాహ వేడుక కోసం భర్తతో కలిసి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి అక్కడికి వచ్చి రివాల్వర్తో కాల్పులు జరిపి హత్య చేశాడు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 24 ఏళ్ల తృప్తి, 28 ఏళ్ల అవినాష్ వాగ్ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. […]
MRPS Leader Murdered : అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఆలూరు నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులో ఆలూరు రోడ్డు చిప్పగిరి రైల్వే బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గుంతకల్ నుంచి లక్ష్మీనారాయణ వెళ్తుండగా హత్య చేశారు. లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని టిప్పర్తో ఢీకొట్టారు. కారులో చిక్కుకున్న అతడిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడిచేశారు. స్థానికులు గమనించి […]
Vikarabad district road accident.. three dead : వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు చోటుచేసుకుంది. ఐనన్పల్లి వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎస్సై సత్యనారాయణ వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కర్ణాటకలోని గనుగాపూర్లోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి కారులో వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో చిట్లపల్లి-యాలమద్ది గ్రామాల మధ్య జాతీయ రహదారిపై […]
Jammu and Kashmir : జమ్మూకశ్మీర్లో మరోసారి కాల్పుల మోత మోగింది. కుల్గామ్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇండియాలో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భారత్ సైనం మట్టుబెట్టిన కొన్ని గంటలకే తంగ్మార్గ్ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్లో ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ కీలక కమాండర్ భద్రతా బలకాలకు చిక్కినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మంగళవారం పహల్గాం ఘటనకు పాల్పడింది […]
TDP Leader murder : ఒంగోలులో దారుణం జరిగింది. టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి గురయ్యారు. ఒంగోలు బైపాస్ రోడ్డులో తన కార్యాలయంలో వీరయ్యపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి కత్తులతో పొడిచారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ దామోదర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరయ్య మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరయ్య చౌదరి హత్యతో ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత […]
SLBC Tunnel : ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరి మృతదేహాలను వెలికితీసిన సంగతి తెలిసిందే. మిగిలిన 6 మంది మృతదేహాల వెలికితీతకు బ్రేక్ పడింది. ఇప్పటివరకు 281 మీటర్లలో పేరుకుపోయిన మట్టి, బండ రాళ్లను తొలగించారు. లోకో రైలు, కన్వేయర్ బెల్టు ద్వారా బయటికి తరలించారు. మిగిలిన 43 మీటర్లలో తవ్వకాలు చేపట్టాల్సి ఉండగా, ప్రమాదకర పరిస్థితి నెలకొంది. దీంతో మృతదేహాల వెలికితీత నిలిచిపోయింది. కేవలం టన్నెల్లో వాటర్గ్ ప్రక్రియ, మట్టి, స్టిల్ కటింగ్లను బయటికి […]
Medak Road Accident : రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెంకట్రావుపేట స్టేజీ వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి షాపూర్నగర్కు చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ నుంచి మెదక్ వైపు ఆల్టో కారు వెళ్తున్నారు. ఇదే సమయంలో ఎదురుగా వచ్చిన మరో కారు ఆల్టో కారును ఢీకొట్టింది. దీంతో ఆల్టోకారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం […]
Prakasam : ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ఇద్దరు బాలురు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సెలవులు కావడంతో పిల్లలు పంట పొలాల్లో క్రికెట్ ఆడుతున్నారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో క్రికెట్ ఆడుతున్న పిల్లలు దగ్గరలో ఉన్న ఓ చెట్టు కిందకి వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడింది. దీంతో ఇద్దరు బాలురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పులుగుజ్జు సన్నీ […]