Gulzar House Tragedy: గుల్జార్ హౌస్ ఘటన.. ఆరుగురి ఉన్నతాధికారులతో కమిటీ!

Minister Ponnam Prabhakar on Gulzar House issue: హైదరాబాద్లోని చార్మినార్ సమీపం ఉన్న గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంపై కీలక కమిటీ ప్రభుత్వం కీలక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతూ ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కమిటీ లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, హైదరాబాద్ సీపీ సివీ ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ , TSSPDCL సీఎండీ ముషారఫ్లు ఉన్నారు. అగ్ని ప్రమాదంపై క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలన్నారు.
ఇదిలా ఉండగా, ఈ నెల 18 వ తేదీన చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు.ఈ ఘటనకు గల కారణాలు తెలుసుకోవాలన్నారు. అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై సీఎంకు సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు.
అలాగే భవిష్యత్లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు సూచనలు, స్థానిక పరిస్థితులు అంచనా వేసి భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు ప్రతిపాదనలతో సూచనలు చేస్తూ ప్రతిపాదనలు చేయాలన్నారు. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.