Last Updated:

Former CM KCR: విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై కమిషన్‌కు మాజీ సీఎం కేసీఆర్ వివరణ

విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. 12 పేజీల లేఖను కమిషన్ కు అందజేశారు. అందులో కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం కావాలనే.. రాజకీయ కక్షతో ఈ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

Former CM KCR: విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై కమిషన్‌కు మాజీ సీఎం కేసీఆర్ వివరణ

 Former CM KCR:విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. 12 పేజీల లేఖను కమిషన్ కు అందజేశారు. అందులో కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం కావాలనే.. రాజకీయ కక్షతో ఈ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. విద్యుత్ సంక్షోభంలో ఉన్న తెలంగాణను.. 24గంటల నాణ్యమైన విద్యుత్ అందించే స్థాయికి తీసుకువచ్చామని వివరించారు.

దురుద్దేశంతోనే కమీషన్ ఏర్పాటు..( Former CM KCR)

తెలంగాణ ప్రభుత్వం దురుద్దేశంతోనే.. కమీఫన్ ఏర్పాటు చేసిందన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని కేసీఆర్ ఆరోపించారు. కమీషన్ చర్యలు తనకు బాధ కలిగించాయని.. విచారణ పూర్తి కాకుండానే ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించారు. విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని.. కమిషన్ నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలని విజ్నప్తి చేశారు.మా ప్రభుత్వం విద్యుత్ విషయంలో ఎలా విజయం సాధించిందో సమాజానికి తెలుసు, విలేకరుల సమావేశంలో విచారణ కమిషన్ చైర్మన్‌గా మీరు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం మరింత బాధాకరం. మీ నోటీసు ప్రకారం జూన్ 15, 2024లోగా కమిషన్‌కు నా ప్రత్యుత్తరాన్ని సమర్పించాలని నేను భావించాను. కానీ విచారణ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా. విలేకరుల సమావేశంలో నా పేరు ప్రస్తావించి లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమయాన్ని పొడిగించడం నన్ను తీవ్ర బాధకు గురిచేసిందని కేసీఆర్ తన 12 పేజీల లేఖలో పేర్కొన్నారు.

విద్యుత్ చట్టం 2009 ప్రకారం ఏర్పడిన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంఘం (SERC) యొక్క రూలింగ్‌లకు మేము కట్టుబడి ఉన్నాము. తీసుకున్న నిర్ణయాలపై అభ్యంతరాలు ఉన్న ఎవరైనా/లు లేదా సంస్థలు తమ అభిప్రాయాలను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్‌సీ)” పబ్లిక్ హియరింగ్‌లో తెలియజేయవచ్చని ఆయన అన్నారు.రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే చత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలుపైఈఆర్‌సీతో అభ్యంతరాలు లేవనెత్తారని కేసీఆర్ తెలిపారు.అతని అభ్యంతరాలను (ఈఆర్‌సీ పరిగణనలోకి తీసుకుంది. తెలంగాణ విద్యుత్ సంస్థలు ముందుకు తెచ్చిన కొనుగోలు ప్రతిపాదనలను కమిషన్ ఆమోదించింది. రేవంత్ రెడ్డికి ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే, విద్యుత్ కోసం అప్పిలేట్ ట్రిబ్యునల్ మరియు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడానికి చట్టం అనుమతించింది. కానీ ఆయన ఆ చర్యను అనుసరించలేదు’ అని కేసీఆర్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి: