Balochistan: స్వతంత్ర దేశం దిశగా బలూచిస్తాన్!

Balochistan: స్వతంత్ర దేశం దిశగా బలూచిస్తాన్ అడుగులు వేస్తుంది. సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. పాకిస్తాన్ చెర నుంచి త్వరలోనే విముక్తి అంటూ బలూచిస్తాన్ లీడర్ మిర్ యార్ బలూచ్ ఓ ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్ పనై పోయిందని.. ఇక తమకు స్వతంత్రం వచ్చినట్టేనని బలూచిస్తాన్ ప్రకటించింది. అంతేకాకుండా సొంత కరెన్సీ, పాస్ పోర్టు జారీ చేసే అధికారాలు త్వరలోనే బలూచిస్తాన్కు వస్తారని ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలో బలూచిస్తాన్ ఎంబసీ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని భారత్ను కోరింది.
భారత్కు బలూచిస్తాన్ ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. భారత్ చర్యలతో బలూచిస్తాన్లో సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ జెండాను పీకేసి బలూచిస్తాన్ జెండాలను ఆవిష్కరిస్తున్నారు. మిస్సైల్ ఇస్తే పాక్ను లేపేస్తామంటూ మోదీకి విజ్ఞప్తి చేస్తున్నారు. పాక్ భూ భాగంలో 46శాతం ఉన్న బలూచిస్తాన్కు భారత్ ఆయుదాలు ఇస్తే పాక్ను లేపేస్తామంటూ బలూచిస్తాన్ ప్రజలు ట్వీట్స్ చేస్తున్నారు.
ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇండియా చేసిన మెరుపుదాడితో యావత్ ప్రపంచం షాక్కు గురయ్యింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఇండియాను ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించింది. పహల్గామ్ టెర్రర్ దాడుల తర్వాత ఇక ఓపిక నశించి … టెర్రరిస్టులకు గట్టి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. అదును చూసి మెరుపువేగంతో కేవలం 25 నిమిషాల్లో పీఓకెలో అల్లకల్లోలం సృష్టించి తిరిగి తమ తమ బేస్లకు ఇండియన్ ఫైటర్ జెట్స్ సురక్షితంగా చేరుకున్న సంగతి తెలిసిందే
భారత్-పాక్ బోర్డర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ దాడిని భారత సైన్యం తిప్పికొడుతుంది. దేశవ్యాప్తంగా భద్రతను పెంచిన కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.
ఆపరేషన్ సింధూర్ 2.0 ద్వారా భారత్ సత్తా తెలియజెప్పామంటున్నారు రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ గోపాల్. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం తప్ప పాకిస్తాన్కు సత్తా లేదంటున్నారు. యుద్ధానికి సిద్ధమంటూనే పాకిస్తాన్ ఆర్మీ భయపడుతోందన్నారు. పాకిస్తాన్ దేశం ముక్కలవడం ఖాయమని టైర్డ్ ఆర్మీ కెప్టెన్ గోపాల్ చెబుతున్నారు.