Published On:

Annavaram: కన్నుల పండుగగా సత్యదేవుడి కళ్యాణం

Annavaram: కన్నుల పండుగగా సత్యదేవుడి కళ్యాణం

Annavaram: కాకినాడ జిల్లా అన్నవరంలో కొలువుదీరిన సత్యదేవుడి వార్షిక కళ్యాణం గురువారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను గ్రామోత్సవం అనంతరం రాత్రి 9 గంటలకు కళ్యాణవేదిక వద్దకు తీసుకువచ్చారు.

 

సుగంధభరిత పుష్పాలతో అలంకరించిన వేదికపై దంపతులను.. మరో వేదికపై పెళ్లి పెద్దలైన సీతారాములను ఆశీనులను చేసి పండితులు కళ్యాణతంతుకు శ్రీకారం చుట్టారు. సుముహూర్త వేళ జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఒకరి శిరస్సుపై ఒకరు ఉంచారు. స్వామి, అమ్మవారి మెడలో మూడుముళ్లు వేశారు.

 

ఎమ్మెల్యేలు యనమల దివ్య, జ్యోతుల నెహ్రూ, సత్యప్రభ, ఎమ్మెల్సీ అనంతబాబు, ఛైర్మన్ ఐవి. రోహిత్ ఈవో సుబ్బారావు పట్టువస్త్రాలు సమర్పించారు. కళ్యాణం వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

 

ఇంద్రకీలాద్రి నూతన ఈవోగా శీనా నాయక్‌
విజయవాడ ఇంద్రకీలాద్రి నూతన ఈవోగా శీనా నాయక్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనుడైన తనకు ఈవోగా బాధ్యతలు అప్పగించినందుకు సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చేటటువంటి భక్తులకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తానని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని శీనా నాయక్ తెలిపారు.