Chandrababu Review: తల్లికి వందనంపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష.. పథకం అమలుపై ఆరా

CM Chandrababu Review meeting on Thalliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం అమలుపై సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించనున్నారు. పథకంపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే రాష్ట్రంలో తల్లికి వందనం పథకం అమలు కింద అర్హుల అకౌంట్లలో డబ్బులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తల్లుల ఖాతాల్లో రూ. 13 వేల చొప్పున నగదు జమ చేస్తున్నారు. ఇప్పటికే పథకం అమలుకు రూ. 8,745 కోట్లను విడుదల చేయగా 67 లక్షల మందికి లబ్ధి కలిగింది.
పథకం అమలులో భాగంగా 1వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ లో చేరే వారికి ఇంకా డబ్బులు అందాల్సి ఉంది. అయితే వచ్చే నెల వరకు స్కూళ్లు, కాలేజీలలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి అయిన వెంటనే వచ్చే నెలలో ఆయా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో పథకం అమలుపై వస్తున్న అభిప్రాయాలు, ఫిర్యాదులు, సూచనలను సీఎం చంద్రాబాబు ఆరా తీయనున్నట్టు సమాచారం.