Published On:

Minister Piyush Goyal AP Tour: నేడు ఏపీకి కేంద్రమంత్రి పీయుష్ గోయల్.. కీలక అంశాలపై చర్చ!

Minister Piyush Goyal AP Tour: నేడు ఏపీకి కేంద్రమంత్రి పీయుష్ గోయల్.. కీలక అంశాలపై చర్చ!

Minister Piyush Goyal Visits Andhra Pradesh Today: కేంద్రమంత్రి పీయుష్ గోయల్ నేడు ఏపీ పర్యటనకు రానున్నారు. అమరావతిలో మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో కలిసి లంచ్ మీట్ లో పాల్గొననున్నారు. సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి పనులు, నిధుల విషయంలో కేంద్రం సహకారంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. లంచ్ అనంతరం కేంద్ర మంత్రి గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యలు, దిగుబడులు, మద్దతు ధరలు, మార్కెట్ పరిస్థితులు వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

 

ఈ నేపథ్యంలోనే పొగాకు రైతుల సమస్య పరిష్కారం కోసం కేంద్రమంత్రి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే పంటకు తగిన మద్దతు ధరను కూడా పెంచవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో కేంద్రమంత్రి పీయుష్ గోయల్ పర్యటనతో రాష్ట్రంలోని పొగాకు రైతుల్లో ఆసక్తి నెలకొంది. అనంతరం కేంద్రమంత్రి పీయుష్ గోయల్ తిరుమలకు వెళ్లనున్నారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.