Chandrababu on Yoga: యోగ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి: సీఎం చంద్రబాబు!
Chandrababu on Yoga: యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆఫ్లైన్, ఆన్లైన్లో నిరంతర శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విశాఖలో ఈ నెల 21న నిర్వహించనున్న యోగా దినోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. యోగా దినోత్సవ ఏర్పాట్లపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు సీఎంకు వివరించారు. భద్రత ఏర్పాట్లపై డీజీపీ హరీశ్గుప్తా వివరించారు. పదేళ్ల తర్వాత అతిపెద్ద యోగా కార్యక్రమం చేపడుతున్నామని.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కేలా ఏర్పాట్లు పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు అన్నారు. యోగా నిర్వహణలో కొత్త రికార్డు సృష్టించబోతున్నామని.. దాదాపు 3.4 లక్షల మందికి ఒకే ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు.
“#Yogandhra2025
ప్రపంచానికి భారత దేశం ప్రసాదించిన దివ్య వరం… యోగ. ఆరోగ్యాన్నే కాకుండా ఆయుష్షును పెంచే యోగ మన జీవన విధానం కావాలి. ఈ నెల 21న విశాఖపట్నంలో 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రధాని శ్రీ @narendramodi గారు ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. రండి… మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. యోగాను జీవితంలో భాగం చేసుకుందాం… ఆరోగ్యంగా జీవిద్దాం.” అని ట్వీట్ చేశారు.
#Yogandhra2025
ప్రపంచానికి భారత దేశం ప్రసాదించిన దివ్య వరం… యోగ. ఆరోగ్యాన్నే కాకుండా ఆయుష్షును పెంచే యోగ మన జీవన విధానం కావాలి. ఈ నెల 21న విశాఖపట్నంలో 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రధాని శ్రీ… pic.twitter.com/NKdrQ4bafU— N Chandrababu Naidu (@ncbn) June 15, 2025