Published On:

Thalliki Vandanam Funds: ఏపీ విద్యార్థుల తల్లులకు శుభవార్త.. అకౌంట్లోకి రూ.13,000.. చెక్ చేసుకోండిలా!

Thalliki Vandanam Funds: ఏపీ విద్యార్థుల తల్లులకు శుభవార్త.. అకౌంట్లోకి రూ.13,000.. చెక్ చేసుకోండిలా!

AP Government Depositing 13 Thousand for ‘Thalliki Vandanam’ Scheme: ఏపీ ప్రభుత్వం విద్యార్థుల తల్లులకు శుభవార్త చెప్పింది. ‘తల్లికి వందనం’ పథకం డబ్బులను రిలీజ్ చేసినట్లు ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా మొత్తం 35.44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున నగదు జమ కానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 54.94 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

 

తొలుత ఈ ప్రక్రియ సాయంత్రం వరకు పూర్తవునున్నట్లు ప్రకటించగా.. ఉదయమే కొంతమందికి ఖాతాల్లో నగదు పడినట్లు మెసేజ్‌లు వచ్చాయి. ఇందులో భాగంగానే ఓ లబ్ధిదారుడికి ఇద్దరు పిల్లలు ఉండగా.. రూ.26వేలు పడినట్లు సంబంధిత బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చింది. దీనిని టీడీపీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

 

‘ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరి ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.13వేల చొప్పున డబ్బులు పడుతున్నాయి. మిగతా రూ.2వేలు ఒక్కొక్కరి తరపుణ స్కూల్ ఖాతాల్లో పడ్డాయని పోస్ట్ చేసింది.

 

ఈనెల 12 నుంచి ఈ పథకం ప్రారంభమవ్వగా.. ఈ నెల 20 వరకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిష్కరించుకోవచ్చని చెప్పారు. జూన 30న ఫైనల్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత ఎవరైనా అర్హులకు నగదు పడని సమక్షంలో జులై 5 పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు.

 

ఇవి కూడా చదవండి: