Last Updated:

Fever Survey: తెలంగాణలో ఇంటింటా ఫీవర్ సర్వే

డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ఫీవర్ సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Fever Survey: తెలంగాణలో ఇంటింటా ఫీవర్ సర్వే

Hyderabad: డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ఫీవర్ సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హెల్త్, మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి డెంగీ నివారణ చర్యలపై మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సర్వేలో భాగంగా ఇంటింటికి తిరిగి ఆశాలు, ఏఎన్ఎంలు మందులు కిట్లను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం టీఎస్ఎంఎస్ఐడీసీ మందుల కిట్లను సిద్ధం చేస్తోంది. జ్వర లక్షణాలు ఉన్నవారికి ఈ మందులు వాడాలని పంపిణీ చేయనున్నారు. ఈ కిట్ తర్వాత కూడా జ్వరం తగ్గకపోతే టెస్టులు చేస్తారు. అంతేగాక ప్రతీ రోజు మానిటరింగ్ చేసేందుకు ఆశాలు, ఏఎన్ఎంలు వివరాలు నమోదు చేసుకోనున్నారు.

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ ఏయే వార్డుల్లో డెంగీ కేసులు ఎక్కువ ఉన్నాయో జీహెచ్‌ఎంసీ కమిషనర్లు, జోనల్, డిప్యూటీ కమిషనర్లు పరిశీలించాలని, నివారణకు ప్రత్యేక ప్రణాళిక తయారుచేయాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. విద్యార్థులు, టీచర్లు, ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొని పని చేసేలా కార్యక్రమాలు రూపొందించాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఇళ్లకు స్టిక్కర్లు అతికించాలి. డిజిటల్‌ మాధ్యమంలో బాగా ప్రచారం నిర్వహించాలని కేటీఆర్‌ ఆదేశించారు.

ఇవి కూడా చదవండి: