Last Updated:

KTR-Siddaramaiah: కేటీఆర్, సిద్దరామయ్యల మధ్య మాటల యుద్దం

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు,(కేటీఆర్) కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య మంగళవారం ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తాం. అంతమాత్రాన ఫ్రీగా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది. అయితే డబ్బులు లేవంటూ సీఎం సిద్దరామయ్య మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.

KTR-Siddaramaiah: కేటీఆర్, సిద్దరామయ్యల మధ్య  మాటల యుద్దం

KTR-Siddaramaiah: : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు,(కేటీఆర్) కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య మంగళవారం ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తాం. అంతమాత్రాన ఫ్రీగా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది. అయితే డబ్బులు లేవంటూ సీఎం సిద్దరామయ్య మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. దీనిని కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ‘X’లో షేర్ చేసుకున్నారు .

ఎన్నికల్లోఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి డబ్బులు లేవని సిద్దరామయ్య అంటున్నారు. అలా హామీల ప్రకటన ఇచ్చేముందు ఆలోచన చేయరా? తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు.అయితే ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారని కేటీఆర్‌పై సిద్ధరామయ్య తిప్పికొట్టారు. తెలంగాణ ఎన్నికల్లో మీ పార్టీ ఎందుకు అధికారాన్ని కోల్పోయిందో తెలుసా? ఎందుకంటే ఏది ఫేక్ మరియు ఎడిట్ చేయబడినది మరియు ఏది నిజం అని ఎలా ధృవీకరించాలో కూడా మీకు తెలియదని సిద్దరామయ్య కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు.బీజేపీ ఫేక్ ఎడిటెడ్ వీడియోలను సృష్టిస్తుందని, బీఆర్‌ఎస్ వాటిని సర్క్యులేట్ చేస్తోందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. మీది బీజేపీకి చెందిన పర్ఫెక్ట్ బి టీమ్. మీకు ఇంకా వాస్తవాలపై ఆసక్తి ఉంటే, దీన్ని చదవండి అని సిద్ధరామయ్య రాశారు. కొంతమంది బిజెపి నాయకులు తన ప్రకటన యొక్క ఎడిట్ చేసిన వీడియోలింక్‌ను పంచుకున్నారు.

తప్పుడు సమాచారం వ్యాప్తి..( KTR-Siddaramaiah)

కేటీఆర్ ట్వీట్‌పై తెలంగాణ కాంగ్రెస్ కూడా మండిపడింది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉంటూ ప్రవళిక గ్రూప్ పరీక్షకు దరఖాస్తు చేయలేదని కేటీఆర్ ఫేక్ స్టేట్‌మెంట్ ఇచ్చారని పార్టీ అధికారిక హ్యాండిల్ నుండి ట్వీట్ చేసింది.ఫాక్స్‌కాన్‌ తమ ప్రతిపాదిత ప్లాంట్‌ను హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు మార్చాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ కోరుతున్నట్లు కెటిఆర్‌ ఎక్స్‌లో నకిలీ లేఖను కూడా పోస్ట్ చేశారని అందులో పేర్కొంది.ఇప్పుడు మీరు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పేరుతో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం ప్రారంభించారు. మీరు తప్పుడు సమాచారంతో బతుకుతున్నారని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు, అందుకే మిమ్మల్ని ఫామ్‌హౌస్‌లో కూర్చోబెట్టడానికి షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఇప్పటికైనా మారరా అని కాంగ్రెస్ ప్రశ్నించింది.