Published On:

Asim Munir got Promotion: దాయాది దేశంలో కీలక పరిణామం.. పాక్ ఆర్మీ చీఫ్‌కు ప్రమోషన్

Asim Munir got Promotion: దాయాది దేశంలో కీలక పరిణామం.. పాక్ ఆర్మీ చీఫ్‌కు ప్రమోషన్

Pakistan Army Chief Asim Munir got Promotion: భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. రెండు దేశాలు యుద్ధానికి విరామం ప్రకటించగా, తాజాగా దాయాది దేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిం మునీర్‌కు ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. దేశంలో అత్యున్నత సైనిక హోదా కలిగిన ‘ఫీల్డ్ మార్షల్’గా నియమించేందుకు కేబినెట్ ఆమెదం తెలిపింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

 

ఇటీవల భారత్-పాక్‌ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఆసిం మునీర్ కీలక పాత్ర వహించినట్లు పాక్ భావిస్తోంది. ఇందులో తామే పైచేయి సాధించినట్లు చెబుతున్నట్లు సమాచారం. పాక్ సాయుధ బలగాలను ముందుండి నడిపించినందుకే ఆర్మీ చీఫ్‌కు ప్రమోషన్ కట్టబెట్టినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

 

పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ద్వారా పాకిస్థాన్‌లోని ఉగ్ర, సైనిక స్థావరాలను తీవ్రంగా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పదుల సంఖ్యలో పాక్ సైనికులు, అధికారులు మృతిచెందారని, అనేకమంది పాకిస్థాన్ సైనికులు గాయపడినట్లు భారత్ సైనిక వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ తమదే పైచేయి అని భ్రమలో ఉన్న పాక్.. తమ సైన్యాధ్యక్షుడికి పదోన్నతి కల్పించడం గమనార్హం.

 

ఇవి కూడా చదవండి: