Israel – Hamas War: ఆగని మృత్యుఘోష.. గాజాలో 60 మంది మృతి!

60 Died in Israeli attacks on Gaza: ఇజ్రాయెల్ భారీగా దాడులకు పాల్పడుతోంది. దీంతో గాజాలో మరణమృదగం మోగుతోంది. డాడుల్లో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు దుర్మరణం చెందుతున్నారు. తాజాగా గాజా స్ట్రిప్ అంతటా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు టెల్అవీవ్ చేసిన వైమానికి దాడుల్లో 60 మంది మృతిచెందినట్లు గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. ఉత్తర గాజాలో పనిచేస్తున్న మూడు ఆసుపత్రుల్లో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో క్షతగాత్రులకు చికిత్స అందించడం సమస్యగా మారిందని అధికారులు వాపోయారు. ఇందులో గాజా ప్రజలకు వైద్యం అందిస్తున్న ఇండోనేసియా ఆసుపత్రి కూడా ఉందని తెలిపారు.
కొన్ని రోజుల నుంచి దాడులు..
కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తోంది. వారం రోజుల్లోనే టెల్అవీవ్ దాడుల్లో వేలమంది పాలస్తీనియన్ల ప్రాణాలు పోగొట్టుకున్నారు. మొన్నటి వరకు వైమానిక దాడులే అధికంగా చేస్తూ వచ్చింది. ఇప్పడూ ఇజ్రాయెల్ భూతల దాడులను పెంచింది. జబాలియా శరణార్థి శిబిరంతోపాటు అల్ మువాసీలో గుడారాల్లో తల దాచుకుంటున్న వారిపై బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపనకు హమాస్ అంగీకరించనందునే దాడులను తీవ్రం చేసినట్లు ఇటీవల నెతన్యాహు వెల్లడించారు.
ట్రంప్తో ఫోన్లో చర్చలు..
తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో చర్చలు జరిపిన అనంతరం నెతన్యాహు మీడియాతో మాట్లాడారు. గాజా మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకుంటామని వెల్లడించారు. దౌత్య కారణాలకు లోబడి గాజాల్లో క్షామాన్ని నివారించాల్సిన అవసరాన్ని తాము గుర్తించామని చెప్పారు. తమ పోరాటం తీవ్రస్థాయిలో ఉందని పేర్కొన్నారు. తాము పురోగతి సాధిస్తున్నామని తెలిపారు. ఆ ప్రాంతం మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటామని తెలిపారు. ఇందులో వెనక్కి తగ్గేదేలేదన్నారు. విజయం సాధించాలంటే మనల్ని అడ్డుకోలేరనేవిధంగా వ్యవవహరించాలని టెలీగ్రామ్ వేదికగా నెతన్యాహు ఒక వీడియోను పోస్టు చేశారు.