Manchu Vishnu: రక్తం పంచుకుపుట్టిన వాళ్లే నా పతనం కోరుకుంటున్నారు – మంచు వివాదాలపై విష్ణు రియాక్షన్

Manchu Vishnu Comments on Prabhas and Family Issues: మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప మూవీతో బిజీగా ఉన్నాడు. జూన్ 7న ఈ సినిమా థియేటర్లోకి రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ని మొదలుపెట్టింది మూవీ టీం. ఇందులో తాజాగా మంచు విష్ణు ఓ పాడ్కాస్ట్కు ఇంటర్య్వూలో ఇచ్చాడు. ఇందులో కన్నప్ప మూవీ విశేషాలతో పాటు హీరో ప్రభాస్పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అలాగే మంచు వివాదం, కుటుంబ విషయాలపై స్పందించాడు.
ప్రభాస్ ఎంత గొప్ప నటుడతో అతడికి కూడా తెలియదు. ప్రభాస్ లాంటి మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంత పెద్ద స్టార్ అయిన కూడా చాలా సింపుల్గా ఉంటారు. డౌన్ టూ ఎర్త్. అలా ఉండటం నిజం ప్రభాస్ గొప్పతనం. మా ఇద్దరిది చాలా మంచి బాండింగ్. మేం ఎప్పటికీ సోదరులమే. రక్తం పంచుకుని పుట్టినవాళ్లే ఈ రోజు నా పతనాన్ని కోరుకుంటున్నారు. కానీ, ప్రభాస్-నేను రక్తం పంచుకుని పుట్టలేదు. కానీ నా మంచి కోరే వ్యక్తి. నా సక్సెస్ కోరుకుంటున్నాడు. ఎన్ని జన్మలకైనా నేను అతడికి రుణపడి ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు.
అనంతరం తన తండ్రి మోహన్ బాబు గురించి మాట్లాడుతూ.. తన తండ్రి ఆనందమే తనకు ముఖ్యం అన్నాడు. దానికోస తాను ఏమైనా చేస్తానని, ఆయన సంతోషంగా లేకపోతే తనకేం అక్కర్లేదు అన్నాడు. ఆయనకు చెడ్డ పేరు తీసుకవచ్చిన రోజు తాను బతికున్న చచ్చినట్టేనని, ఆ రోజు ఎప్పటికీ తీసుకురానంటూ ఎమోషనల్ అయ్యాడు. ఎప్పుడూ కూడా ఆయన పేరు నిలబెట్టడానికే ప్రయత్నిస్తానని, కానీ చెడగొట్టేలా మాత్రం ఎప్పుడూ ప్రవర్తించనన్నాడు. ఇక విష్ణు కామెంట్స్ చూస్తుంటే పరోక్షంగా తన తమ్ముడు మంచు మనోజ్ ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం విష్ణు కామెంట్స్ నెట్టింట హాట్టాపిక్గా మారాయి.