Covid-19: భారీగా పెరిగిన కరోనా కేసులు.. దేశంలో 5 వేల మార్క్ క్రాస్
Corona Virus: దేశంలో కరోనా వైరస్ క్రమంగా తన పంజా విసురుతోంది. రోజురోజుకు యాక్టీవ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో దేశంలో కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో 498 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 5 వేల మార్క్ దాటిపోయింది. మరోవైపు పెరుగుతున్న కరోనా కేసులతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
కాగా నిన్న ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 498 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 5,364 కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో కేరళ 1679, గుజరాత్ 615, పశ్చిమ బెంగాల్ 596, ఢిల్లీ 592, మహారాష్ట్ర 548, కర్ణాటక 451 కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా బారిన పడి తాజాగా నలుగురు చనిపోయారు. ఇందులో కేరళలో ఇద్దరు, కర్ణాటక, పంజాబ్ లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో కరోనా బారినపడి ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 55కి చేరింది.