Published On:

Pak Army Chief Asim Munir Missing: భారత్ దెబ్బకు పారిపోయిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్..?

Pak Army Chief Asim Munir Missing: భారత్ దెబ్బకు పారిపోయిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్..?

Pakistan Army Chief Asim Munir Missing: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కనిపించడంలేదు. వారం రోజులుగా పాక్ ఆర్మీ చీఫ్ పత్తాలేకుండా పోయారు. 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ మిస్సైల్ దాడులు చేసింది. భారత్ దాడులు చేసే సమయానికి పారిపోయినట్టు అనుమానిస్తున్నారు. బంకర్‌లో దాక్కున్నాడా? దేశం వదిలి పారిపోయాడా? టాప్ టెర్రరిస్ట్‌లు హతం కావడంతో టెన్షన్‌లో ఉన్నాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

 

కాల్పుల విరమణ అంశంలోనూ అసిం మునీర్ ఎక్కడా కనిపించలేదు. ప్రతిసారి ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మీడియా ముందుకు వస్తున్నారు. ఎక్స్‌లోనూ పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్‌ స్పందించలేదు. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత్ దాడి చేయడంతో అసిం మునీర్ బంకర్‌లో దాక్కున్నాడు. ఇంకా షాక్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది.

 

పాకిస్తాన్‌పై జరిపిన దాడులను ఆధారాలతో సహా భారత్ చూపించింది. పాకిస్తాన్‌లోని ఏ ఎయిర్ బేస్‌పై దాడి చేశామో ఫొటోలతో సహా భారత్ వివరణ ఇచ్చింది. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడుల ఆధారాలను భారత్ బయటపెట్టింది. మరోవైపు పాకిస్తాన్ అబద్ధాలను ప్రచారం చేస్తుంది.

 

భారత్‌లో ఆర్మీ స్థావరాలను పేల్చేశామంటూ అబద్దపు ప్రకటనలు చేస్తోంది. భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం కూడా నాశనం చేశామని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఒక్కదానికి కూడా పాకిస్తాన్ ఆధారాలు చూపించలేదు. పాక్ ఆర్మీ మీడియా సమావేశాన్ని చూసి జర్నలిస్ట్‌లు తలలు పట్టుకున్నారు. నిన్న పాక్ ఆర్మీ ప్రెస్‌మీట్ కామెడీని తలపించింది.