Published On:

Operation Sindoor 2.0: ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తాం: భారత ఎయిర్ ఫోర్స్ సంచలనం!

Operation Sindoor 2.0: ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తాం: భారత ఎయిర్ ఫోర్స్ సంచలనం!

Operation Sindoor 2.0 Will continues.. said By Indian Airforce: పాకిస్థాన్ దుశ్చర్యకు భారత్ సీరియస్ అయింది. ఆపరేషన్ సింధూర్ 2.0 కొనసాగిస్తామని ప్రకటించింది. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ది చెబుతామన్నారు. కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ దాడులు చేయడంతో.. కాల్పుల ఉల్లంఘనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని సహించేది లేదని.. పాక్ తన వక్రబుద్ధిని మానుకోవాలని హితవు పలికింది.

 

పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందపై కేంద్రం స్పందించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు తగిన పాక్ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించింది. సరిహద్దుల దగ్గర సాయుధ దళాలు గట్టి నిఘా ఏర్పాటు చేశామని తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంట..ఉల్లంఘనలు పునరావృతమైతే.. సమర్థవంతంగా ఎదుర్కోవాలని భద్రతా బలగాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

 

పాకిస్థాన్ పై విధించిన అన్ని ఆంక్షలు కొనసాగుతాయని భారత్ స్పష్టం చేసింది. సిందూ జలాల విషయంలోనూ ఎలాంటి మార్పు లేదని.. నీటిని విడుదల చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. చర్చల తర్వాతే ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఉగ్రవాదంపై పాక్ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. ఉగ్రవాదంపై భారత్ నిరంతరం యుద్ధం చేస్తుందని తెలిపింది. భవిష్యత్తులో జరిగే ఉగ్రదాడులను యుద్ధంలాగే చూస్తామని.. దానికి తగినట్టే స్పందిస్తామని తేల్చి చెప్పింది.

 

భారత్ సైన్యం..మోదీ ఆర్డర్స్ కోసం వెయిటింగ్ లో ఉంది. 48 గంటల్లో మూడోసారి త్రివిధ దళాలతో మోదీ భేటీ అయ్యారు. పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన తరువాత హై లెవల్ మీటింగ్ జరుగుతోంది. జాతీయ భద్రతాధికారులంతా ప్రధాని నివాసంలో సమావేశమయ్యారు. పాక్ వక్రబుద్దికి సమాధానం చెప్పేలా నిర్ణయం తీసుకోనున్నారు. నిన్నటి పరిమాణాలను మోదీకి టాప్ సెక్యూరిటీ ఆఫీసర్స్ వివరిస్తున్నారు. త్రివిధ దళాధిపతులతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ అనిల్ చౌహాన్ మోదీతో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యచరణపై చర్చించారు.

ఇవి కూడా చదవండి: