Home / India
Indian Army Big Announcement About India-Pakistan Cease-Fire: భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాకిస్థాన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి వివరణ ఇచ్చింది. భారత్, పాక్ డీజీఎంఓల మధ్య ఎలాంటి చర్చలకు ప్లాన్ చేయలేదని తెలిపింది. అంతేకాకుండా కాల్పల విరమణ అవగాహనకు ముగింపు తేది లేదని స్పష్టం చేసింది. అంతకు ముందు మే 12న ఇరు దేశాల డీజీఎంఓలు తీసుకున్న నిర్ణయాలే కొనసాగుతాయని పేర్కొంది. కాగా, నేటి సీజ్ఫైర్ ముగుస్తుందని వస్తున్న వార్తలను భారత […]
Bangladesh: భారత్ కు వ్యతిరేకంగా ఉన్న దేశాలకు మన దేశం మెల్లగా ఒక్కొక్కరికి బుద్ధి చెప్తోంది. భారత్ – పాక్ ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ కు అండగా నిలిచిన టర్కీ, అజార్ బైజాన్ పై ఇప్పటికే ఆంక్షలు విధించింది. తాజాగా ఈ లిస్టులోకి బంగ్లాదేశ్ చేరింది. కొంతకాలంగా భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న బంగ్లాదేశ్ పై చర్యలు తీసుకునేందుకు ఇండియా రెడీ అయింది. అలాగే భారత్- పాక్ మధ్య జరిగిన దాడుల్లోనూ బంగ్లాదేశ్ దాయాది జట్టుకే అండగా […]
Boycott Turkey: భారత్ లో టర్కీ విక్రయాలను AJIO, MYNTRA ఆపేసాయి. తమ వెబ్ పోర్టల్ నుంచి టర్కీ ప్రాడక్ట్ లను తీసివేశాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ పై భారత్ చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో టర్కీ పాక్ కు సపోర్ట్ గా నిలిచింది. పాకిస్తాన్ కు ఆయుధాలు సరఫరా చేసింది. దీంతో టర్కీపై దౌత్యపరమైన చర్యలు తీసుకుంది భారత్. దాంతో పాటే భారత వ్యాపారులు కూడా టర్కీతో వ్యాపార సంబంధాలు తెంచుకున్నారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాదులను […]
Haryana Student Arrested For Allegedly Shared Key Info With Pakistan: హర్యానాలో ఓ గూఢచారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్కు చెందిన రహస్యాలను పాకిస్థాన్ దేశానికి చేరవేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. 2024లో దేవేంద్ర సింగ్.. కర్తార్ పూనర్ కారిడార్ ద్వారా పాకిస్థాన్ వెళ్లి పాకిస్థానీ నిఘా అధికారిని కలిశాడు. ఆ తర్వాత దేవేంద్ర సింగ్ను హనీట్రాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడింది. ఈ సమయంలో […]
All party delegations to carry forth to the world india strong message of zero tolerance against terrorism: పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్థాన్తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఈ ఆపరేషన్లో పాక్లో కీలకమైన ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఇందులో నక్కిన 100 మందికి పైగా ఉగ్రవాదులను హతం చేసింది. ఈ ప్రతీకార దాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా మారాయి. […]
Brahmos Missile: ఆపరేషన్ సిందూర్లో బ్రహ్మోస్ బ్రహ్మాస్త్రంగా మారింది. దీంతో మన బ్రహ్మోస్కు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం బ్రహ్మోస్ క్షిపణుల కోసం 17 దేశాలు క్యూ కట్టాయి. ఆధునిక యుద్ధ తంత్రానికి దిక్చూచిగా మారిన బ్రహ్మోస్ మిస్సైల్స్ కోసం… 200 నుంచి 300 మిలియన్ డాలర్లతో ఇండోనేషియా డీల్కు సిద్ధమవుతుంది. మరోవైపు 700 డాలర్లతో ఒప్పందం కుదుర్చుకునేందుకు వియత్నాం ప్లాన్ చేస్తుంది. అలాగే బ్రహ్మోస్ కోసం మలేషియా, సౌత్ ఏషియన్ కంట్రీస్ థాయ్ లాండ్, సింగపూర్, బ్రూనై […]
India Pakistan Ceasefire: పహెల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ కు వరుస దెబ్బలు తగిలాయి.ప్రపంచ రాజకీయాల్లో పాకిస్తాన్ దాదాపు ఒంటరిదైంది. చైనా, టర్కీ మద్దతు ఇచ్చినా, అది పెద్దగా లెక్కలోకి వచ్చేది కాదు. అన్నిటికంటే ముఖ్యంగా పదుల సంఖ్యల్ ఉన్న ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్ ను దూరం అయ్యాయి. ఆపరేషన్ సిందూర్.. భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ఆపరేషన్ గా ఆపరేషన్ సింధూర్ నిలిచింది. ఉగ్రవాదులు లేదా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము […]
India and Pakistan between ceasefire till may 18: భారత్, పాక్ దేశాల మధ్య పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది టూరిస్టులు చనిపోయారు. ఈ ఘటనను భారత్ సీరియస్గా తీసుకుంది. ఆ వెంటనే పాక్పై ప్రతీకార చర్యలు చేపట్టింది. భారత్ చేసిన ప్రతీకార దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సమయంలో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడడంతో పాటు […]
Three Climbers Died Tragic Mountaineering Accident In America: అమెరికా పర్వాతరోహణలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు లోయలో పడి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ప్రవాస భారతీయుడు విష్ణు ఇరిగిరెడ్డి(48) ఉన్నారు. విష్ణు తన ముగ్గురు మిత్రులు టిమ్ గుయేన్, ఒలెక్సాండర్ మార్టినెంకో, ఆంటోన్ త్సెలిక్లతో కలిసి క్యాస్కేడ్స్లోని నార్త్ ఎర్లీ వింటర్స్ స్పైర్ ప్రాంతాన్ని అధిరోహించేందుకు వెళ్లారు. వీరిలో ఆంటోన్ త్సెలిక్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగా.. మిగతా వారు చనిపోయారు. వివరాల ప్రకారం.. […]
India Pakistan War: పాకిస్తాన్పై మరింత ఒత్తిడి పెంచేందుకు భారత్ మరో యాక్షన్కు సిద్ధమైంది. భారత్లో ఉన్న అన్ని దేశాల అంబాసిడర్లకు, ముఖ్యమైన అధికారులకు ఆపరేషన్ సిందూర్ వివరాలు వెల్లడించనుంది. ఈ మేరకు మద్దతు ఇవ్వాలని వివిధ దేశాలను భారత్ కోరనుంది. విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులకు ఆపరేషన్ సిందూర్ వివరాలను కేంద్రం ఇవ్వనుంది. ఇందులో భాగంగానే, భారత్లో ఉన్న అన్ని దేశాల అంబాసిడర్లు, ముఖ్యమైన అధికారులతో సమావేశం కానుంది. ఇందులో ఆపరేషన్ సిందూర్ […]