Published On:

Operation Sindoor: కేంద్రం మరో కీలక నిర్ణయం.. పాక్‌ను దోషిగా నిలబెట్టేందుకు భారత్ పక్కా వ్యూహం!

Operation Sindoor: కేంద్రం మరో కీలక నిర్ణయం.. పాక్‌ను దోషిగా నిలబెట్టేందుకు భారత్ పక్కా వ్యూహం!

All party delegations to carry forth to the world india strong message of zero tolerance against terrorism: పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో పాక్‌లో కీలకమైన ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఇందులో నక్కిన 100 మందికి పైగా ఉగ్రవాదులను హతం చేసింది. ఈ ప్రతీకార దాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా మారాయి. ఈ తరుణంలో భారత్, పాక్ సరిహద్దుల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సరిహద్దుల్లో ఉన్న అమాయక ప్రజలు చనిపోయారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది.

 

తాజాగా, కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌పై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు భారత్ సిద్దమైంది. ఇందులో భాగంగానే అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఎండగట్టేందుకు పూనుకుంది. ఆ దేశంపై టెర్రర్ బాంబ్ వేసేందుకు పక్కా వ్యూహం సిద్దం చేసింది. ఆపరేషన్ సింధూర్‌పై ప్రపంచ దేశాలకు వివరణ ఇవ్వనుంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలకు ఉగ్రవాదం అణచివేతకు భారత్ చేస్తున్న కృషిని తెలిపేందుకు విదేశాలకు ఆల్ పార్టీ టీమ్‌తో భారత ప్రతినిధి బృందాన్ని పంపనుంది.

 

ప్రపంచ దేశాల ముందు పాక్‌ను దోషిగా నిలబెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ ఎంపీలతో కూడిన బృందం దేశదేశాలకు వెళ్లి అక్కడి ప్రజాప్రతినిధులకు తెలియజేసి పాక్ ముసుగును ఊడదీయనుంది. ఈ ఆల్ పార్టీ టీమ్ మిసైల్‌లో తొలుత 8 దేశాల్లో పర్యటించనుంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి శశిథరూర్, బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, జేడీయూ నుంచి సంజయ్ కుమార్ ఝూ, ఎన్సీపీ ఎస్పీ నుంచి సుప్రియా సూలే, డీఎంకే నుంచి కనిమొళి, శివసేన నుంచి శ్రీకాంత్ శిందే ఉన్నారు.

 

ఇదిలా ఉండగా, పాకిస్థాన్ ఉగ్ర కుట్రను ప్రపంచ దేశాలకు వివరించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మేరకు నలుగురు ఎంపీల పేర్లను కాంగ్రెస్ పంపించింది. అందులో శశిథరూర్ పేరులో లేకపోయినా అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆయనను ఎంపిక చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ వాణిని శశిథరూర్ వినిపించింది. అయితే. అఖిలపక్షంలో తనకు చోటు కల్పించడంపై శశి థరూర్ సంతోషం వ్యక్తం చేశారు.