Published On:

India: బంగ్లాదేశ్ కు భారత్ ఝలక్.. దిగుమతులపై ఆంక్షలు

India: బంగ్లాదేశ్ కు భారత్ ఝలక్.. దిగుమతులపై ఆంక్షలు

Bangladesh: భారత్ కు వ్యతిరేకంగా ఉన్న దేశాలకు మన దేశం మెల్లగా ఒక్కొక్కరికి బుద్ధి చెప్తోంది. భారత్ – పాక్ ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ కు అండగా నిలిచిన టర్కీ, అజార్ బైజాన్ పై ఇప్పటికే ఆంక్షలు విధించింది. తాజాగా ఈ లిస్టులోకి బంగ్లాదేశ్ చేరింది. కొంతకాలంగా భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న బంగ్లాదేశ్ పై చర్యలు తీసుకునేందుకు ఇండియా రెడీ అయింది. అలాగే భారత్- పాక్ మధ్య జరిగిన దాడుల్లోనూ బంగ్లాదేశ్ దాయాది జట్టుకే అండగా నిలిచింది. ఒకవేళ పాకిస్తాన్ పై దాడులు చేస్తే తాము భారత్ పై యుద్ధం చేస్తామని ఆదేశం ప్రకటించింది.

 

ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ కు గుణపాఠం చెప్పాలని భారత్ ఫిక్స్ అయింది. అందులో భాగంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చే దిగుమతులపై ఆంక్షలు విధించింది. రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్డ్ ఫుడ్, ఇతర ఉత్పత్తులపై ఆంక్షలు వేసింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నిన్న ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం బంగ్లాదేశ్ నుంచి వచ్చే రెడీమేడ్ దుస్తుల దిగుమతి కోల్ కతా, నవాషెవా పోర్టుల ద్వారా మాత్రమే అనుమతించనున్నారు.

 

అలాగే ల్యాండ్ ట్రాన్సిట్ పోస్టుల నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులపైన కూడా భారత్ నిషేధం వేసింది. వీటిలో రెడీమేడ్ వస్తువులు, ప్రాసెస్డ్ ఫుడ్, ప్లాస్టిక్, ఫర్నిచర్, కార్బోనేటేడ్ వాటర్ వంటివి ఉన్నాయి. కానీ భారత్ మీదుగా నేపాల్, భూటాన్ కు సరఫరా అవుతున్న వస్తువులపై మాత్రం ఆంక్షలు సడలించింది. దీంతో తీవ్ర ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బంగ్లాదేశ్ కు తాజా నిర్ణయం పెద్ద ఎదురుదెబ్బలా మారింది.