Published On:

Tragic Mountaineering Accident: విషాదం మిగిల్చిన పర్వాతరోహణ.. ప్రవాస భారతీయుడితో పాటు మరో ఇద్దరు మృతి

Tragic Mountaineering Accident: విషాదం మిగిల్చిన పర్వాతరోహణ.. ప్రవాస భారతీయుడితో పాటు మరో ఇద్దరు మృతి

Three Climbers Died Tragic Mountaineering Accident In America: అమెరికా పర్వాతరోహణలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు లోయలో పడి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ప్రవాస భారతీయుడు విష్ణు ఇరిగిరెడ్డి(48) ఉన్నారు. విష్ణు తన ముగ్గురు మిత్రులు టిమ్‌ గుయేన్‌, ఒలెక్సాండర్‌ మార్టినెంకో, ఆంటోన్‌ త్సెలిక్‌లతో కలిసి క్యాస్కేడ్స్‌లోని నార్త్‌ ఎర్లీ వింటర్స్‌ స్పైర్‌ ప్రాంతాన్ని అధిరోహించేందుకు వెళ్లారు. వీరిలో ఆంటోన్‌ త్సెలిక్‌ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగా.. మిగతా వారు చనిపోయారు.

 

వివరాల ప్రకారం.. అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయుడు విష్ణు ఇరిగిరెడ్డి(48) ఇంజినీరింగ్ విభాగంలో ఫ్లూక్ కార్పోరేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి కాలేజీల్లో చదువుతున్న సమయం నుంచి పర్వతారోహణ చేయడం ఇష్టంగా మలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం తన ముగ్గురు స్నేహితులతో కలిసి నార్త్ కాస్కేడ్స్ పర్వతాల్లో అధిరోహించాలని ప్లాన్ చేశారు.

 

ఈ మేరకు మే 11న తన ముగ్గురు స్నేహితులు టిమ్ గుయెన్(63), ఆంటోన్ సెలిక్(38), ఒలెగ్జాండర్ మార్టినెంకో(36)లతో కలిసి ఆ పర్వత శిఖరాన్ని అధిరోహిస్తుండగా.. ఒక్కసారిగా ఆ ప్రాంతాల్లో భారీ తుపాన్ సంభవించింది. ఈ సమయంలో వారు తిరిగి వెనక్కి వెళ్లిపోదామని అనుకుంటున్న తరుణంలో యాంకర్ పాయింట్ ఊడిపోయింది. దీంతో అందరూ దాదాపు 200 అడుగుల లోతులో ఉన్న ఓ లోయలో అదుపుతప్పి పడ్డారు.

 

ఇందులో ఆంటోన్ సెలిక్ మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వెంటనే అక్కడి నుంచి దాదాపు 64 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. అనంతరం అధికారులకు సమాచారం అందించగా.. విస్తృత తనిఖీలు చేపట్టి మృతదేహాలను గుర్తించారు. వెంటనే హెలికాప్టార్‌లో మృతదేహాలను తరలించారు.

 

ఈ విషయంపై కుటుంబ సభ్యులను అడగగా.. విష్ణుకు పర్వతారోహణ అంటే బాగా ఇష్టమని తెలిపారు. అతను అందరితో చాలా మంచిగా ఉండేవాడని, సియోటెల్‌లో ఉన్న టెక్, కల్చరల్ కమ్యూటికీ సభ్యుడని చెప్పారు. మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, ఇంతలో విషాదం జరగడం బాధకరమని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక, విష్ణు కర్ణాటకలోని నిట్‌లో మెకానిల్ విభాగంలో ఇంజినీరింగ్ చదివి.. అక్కడి నుంచి మిస్సౌరి యూనివర్సిటీలో ఎంఎస్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.