IPL 2025: గుజరాత్ టైటాన్స్తో సన్రైజర్స్ పోరు.. ఓడితే ఆశలు వదులుకోవాల్సిందే!

Gujarat Titans, Sunrisers Hyderabad IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మేరకు ఇవాళ జరిగే 51 మ్యాచ్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్కు చాలా కీలకం కానుంది.
ఈ సీజన్లో ఇప్పటివరకు గుజరాత్ రాయల్స్ 9 మ్యాచ్లు ఆడగా.. 6 మ్యాచ్ల్లో గెలుపొందింది. మిగతా 3 మ్యాచ్ల్లో ఓటమి చెందడంతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. అలాగే, సన్రైజర్స్ హైదరాబాద్ కూడా 9 మ్యాచ్లు ఆడింది. ఇందులో 3 మ్యాచ్ల్లో గెలుపొందగా.. 6 మ్యాచ్ల్లో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పరిమితమైంది.
ఇదిలా ఉండగా, గుజరాత్ 6 మ్యాచ్లు గెలిచి మెరుగైన స్థితిలో ఉండగా, హైదరాబాద్ 6 మ్యాచ్ల్లో ఓటమి చెందడంతో ప్లే ఆఫ్ ఆశలపై సస్పెన్స్ నెలకొంది. ఇవాళ జరిగే మ్యాచ్లో హైదరాబాద్ గెలుపొందితే ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. కానీ గుజరాత్ జట్టు బలంగా ఉండడంతో ప్రతీ బ్యాటర్ పోరాడాల్సి ఉంటుంది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్ విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన కనబరిస్తే గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి.
ఐపీఎల్ టోర్నీలో గుజరాత్, హైదరాబాద్ జట్లు 5 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో గుజరాత్ టైటాన్స్ 3 గెలుపొందగా.. సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కమ్యాచ్ గెలిచింది. మరో మ్యాచ్ ఫలితం తేలలదు. కాగా, హైదరాబాద్పై గుజరాత్ అత్యధికంగా 199 పరుగులు చేయగా.. అత్యల్ప స్కోరు 16 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టు అత్యధికస్కోరు 195 పరుగులు చేయగా.. అత్యల్ప స్కోరు 154 పరుగులు చేసింది.