IPL 2025: దుమ్మురేపుతున్న గుజరాత్.. వరుసగా నాలుగో విక్టరీ

Gujarat Titans vs Rajasthan Royals, Gujarat Titans won by 58 runs: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన 23వ మ్యాచ్లో జరిగిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో గుజరాత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. సుదర్శన్(82) మెరుపులు మెరిపించాడు.
తర్వాత 218 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రాజస్థాన్ తడబడింది. మూడు ఓవర్లలోనే యశస్వి జైస్వాల్(6), నితీష్ రాణా(1) ఔట్ అయ్యారు. శాంసన్(41), పరాగ్(26), హెట్ మయర్(52) పరుగులు చేసిన ఫలితం దక్కలేదు. దీంతో 58 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఇక, గుజరాత్ టైటాన్స్ దుమ్మురేపుతోంది. కోచింగ్ విషయంలో పెద్దగా హడావిడి అంతగా ఉండకపోవడంతో పాటు యజమానులు సైతం కనిపించరు. అంతకుముందు ఏదో 5 మ్యాచ్లు గెలిస్తే గొప్పే అనేలా అన్నట్లుండే ఈ జట్టు మైదానంలోకి వచ్చేసరికి అందరి అంచనాలను తలకిందులు చేస్తోంది. బట్లర్, గిల్, రషీద్ వంటి స్టార్లు ఉండగా.. రూథర్ పోర్డు, సుదర్శన్, తెవాటియా బ్యాటర్లు, సిరాజ్, ప్రసిద్ధ్, ఇషాంత్, సాయి కిశోర్ బౌలర్లతో గుజరాత్ దుమ్మురేపుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్లో కొనసాగుతోంది.