Published On:

IPL 2025: ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్‌తో పంజాబ్ ఢీ

IPL 2025: ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్‌తో పంజాబ్ ఢీ

Chennai Super Kings vs Punjab Kings In IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో ఇవాళ 49 మ్యాచ్ జరగనుంది. చెన్నై వేదికగా ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు చెన్నై సూపర్ కింగ్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు చెన్నై 9 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 2 మ్యాచ్‌లు మాత్రమే గెలవగా.. 7 మ్యాచ్‌లు ఓటమి చెందడంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్‌.. 9 మ్యాచ్‌లు ఆడగా.. 5 మ్యాచ్‌లు గెలవడంతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది.

 

చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మిగతా ఏడు మ్యాచ్‌ల్లో ఓడింది.అయితే చెన్నై ఇంకా ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో అన్ని మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్స్ చేరడం కష్టమేనని తెలుస్తోంది. ఒకవేళ్ చెన్నై ఈ మ్యాచ్‌లో గెలిస్తే మిగతా 4 మ్యాచ్‌లపై ప్రభావం పడుంది. టాప్ 4లో నిలవాలంటే చెన్నైకి అద్భుతమే జరగాల్సి ఉంటుంది.

 

పంజాబ్ కింగ్స్ జట్టు 9 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 5 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఈ జట్టు ఇంకా 5 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో 2 లేదా 3 మ్యాచ్‌లు గెలిస్తే టాప్ 4 లో ఉండనుంది.