Published On:

BCCI on Asia Cup 2025: పాకిస్థాన్‌తో వివాదం.. బీసీసీఐ కీలక నిర్ణయం!

BCCI on Asia Cup 2025: పాకిస్థాన్‌తో వివాదం.. బీసీసీఐ కీలక నిర్ణయం!

Indian Cricket Team Pulls Out of Asia Cup 2025: భారత్, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు బలిగొన్నారు. ఈ విషయంపై భారత్ సీరియస్ తీసుకుంది. ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య వివాదం రాజుకుంది. భారత్, పాక్ సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. ఇందులో చాలామంది అమాయకులు మరణించారు. ఆ తర్వాత భారత్ ధీటుగా సమాధానం చెప్పింది. భారత్ చేసిన దాడిలో పాక్ సైన్యంలో కొంతమంది మరణించారు. ఆ తర్వాత కాల్పుల విరమణ జరిగింది.

 

తాజాగా, భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏషియా క్రికెట్ కౌన్సిల్‌కు దూరంగా ఉండాలని బీసీసీఐ నిర్ణయించింది. ఏషియా క్రికెట్ కౌన్సిల్‌ నిర్వహించే ఈవెంట్లలో పాల్గొనమని కౌన్సిల్‌కు సమాచారం ఇచ్చింది. కాగా, పాకిస్థాన్ మంత్రి మోహ్సిన్ సఖ్వీ ఏషియా క్రికెట్ కౌన్సిల్‌‌ ప్రెసిడెంట్‌గా ఉండటమే కారణమని తెలుస్తోంది. అలాగే వచ్చే నెల జరిగే ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఏషియా కప్, సెప్టెంబర్‌లో మెన్స్ ఏషియా కప్‌లో భారత్ జట్లు పాల్గొనే అవకాశం లేదు.