Rahul Gandhi: బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది.. రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్
Maharastra: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి గతేడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. అలాగే ఈ ఏడాది చివర్లో బీహార్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే కుట్రకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కూటమి మ్యాచ్ ఫిక్సింగ్ చేసే మహారాష్ట్రలో విజయం సాధిచిందని చెప్పారు. బీజేపీ ఎక్కడ ఓడిపోతే అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తుందని వెల్లడించారు.
అయితే బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా చేసిందో కూడా రాహుల్ గాంధీ వివరించారు. ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెలల్ ను తారుమారు చేయడం, ఓటర్ జాబితాలో దొంగ ఓట్లు చేర్చడం, ఓటింగ్ శాతాన్ని కృత్రిమంగా పెంచడం, బీజేపీకి అవసరమైన చోట్ల దొంగ ఓట్లను లక్ష్యంగా చేసుకోవడం, సాక్ష్యాలను దాచిపెట్టడం వల్లనే బీజేపీ విజయం సాధించిందని చెప్పారు. అలాగే 2023లో కేంద్రంలోని ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని కూడా రాహుల్ తప్పుపట్టారు.