Published On:

PM Modi: చరిత్రలో నిలిచే రోజు.. నేడే చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభం

PM Modi: చరిత్రలో నిలిచే రోజు.. నేడే చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభం

Jammu Kashmir: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నేడు తొలిసారిగా జమ్ముకాశ్మీర్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన, భారత్ లో మొట్టమొదటి కేబుల్- స్టేడ్ రైలు వంతెనను ప్రధాని మోదీ జాతీకి అంకితం చేయనున్నారు. అలాగే కత్రాలో రూ. 46 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే చీనాబ్ రైల్వే వంతెన మీదుగా పరుగులు తీసేలా కత్రా- శ్రీనగర్ మధ్య వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. దీంతో జమ్ముకాశ్మీర్ కు భారతీయ రైల్వేతో నెట్ వర్క్ కనెక్ట్ అవనుంది. అనంతరం కత్రాలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

 

కాగా జమ్ముకాశ్మీర్ పర్యటన గురించి ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “శుక్రవారం (జూన్ 6) జుమ్ముకాశ్మీర్ కు ముఖ్యమైన రోజు. దాదాపు రూ. 46 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తాం. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధిలో జీవన ప్రమాణాలను మారుస్తుంది. కత్రా- శ్రీనగర్ వందే భారత్ ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. చీనాబ్ రైల్వే వంతెన అససాధారణ విజయం” అని ప్రధాని రాసుకొచ్చారు.

 

అయితే చీనాబ్ నదిపై లోయలో రెండు పర్వతాలను కలుపుతూ రైల్వే వంతెనను నిర్మించడం ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి. వంతెన నిర్మాణంతో జమ్ము- శ్రీనగర్ మధ్య కొత్త రైలు మార్గం ఏర్పడింది. దీంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. చీనాబ్ వంతెన నది సాధారణ నీటిమట్టానికి 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా మారింది. జమ్ము కాశ్మీర్ లోని రియాసి జిల్లా బక్కల్, కౌరి గ్రామాలను ఈ వంతెన కలుపుతుంది. ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింగ్ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను కేంద్రం నిర్మించింది. భారీ భూకంపాలు, వరదలను తట్టుకునేలా దీనిని నిర్మించారు. దాదాపు 2.86 కోట్ల టన్నుల స్టీల్ ను ఉపయోగించారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా రూపొందించారు. సుమారు 1.31 కి.మీ. వరకు ఉన్న ఈ వంతెన నిర్మాణానికి కేంద్రం రూ. 1486 కోట్లు ఖర్చు చేసింది.