Published On:

Fire Accident in Hyderabad: చార్మినార్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్ గ్రేషియో ప్రకటన

Fire Accident in Hyderabad: చార్మినార్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్ గ్రేషియో ప్రకటన

PM Modi condoles Fire Accident in Hyderabad: హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో మృతి చెందడం కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. ఈ మేరకు మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల పరిహారం ప్రకటించారు.