Home / Hyderabad
Hyderabad: తెలంగాణ కేబినెట్ సమావేశం రేపు జరగనుంది. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుందని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే మంత్రివర్గం చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రివర్గ ఆమోదం అనంతరం ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. […]
Tragedy: హైదరాబాద్ ఎల్బీనగర్ లో విషాదం నెలకొంది. చింతల్ కుంట ఏరియాలో ఇవాళ తెల్లవారుజామున హైటెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడి ఇద్దరు సజీవదహనమయ్యారు. అక్కడే నిద్రిస్తున్న ఓ శునకం కూడా కాలి బూడిదైంది. కాగా చింతల్ కుంట ప్రాంతంలో రోడ్డుపక్కన ఉన్న ఫుట్ పాత్ పై ఇద్దరు వ్యక్తులు నిద్రిస్తున్నారు. ఈక్రమంలోనే వారిపై హైటెన్షన్ కరెంట్ వైర్లు తెగి వారిపై పడిపోయాయి. ప్రమాదంలో మంటలు అంటుకుని ఇద్దరు పూర్తిగా కాలిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ […]
Telangana Weather: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఇన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలకు వర్షాలతో ఉపశమనం లభించింది. కాగా నిన్న కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 8.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 8.38, యాదాద్రి భువనగిరి 6.55, హైదరాబాద్ లోని ముషీరాబాద్ […]
Bus Pass Prices: తెలంగాణ ఆర్టీసీ మరోసారి బస్ పాస్ రేట్లను పెంచింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ఆర్టీసీ ప్రకటించింది. జనరల్ బస్ పాస్ ధరలతో పాటు, స్టూడెంట్ బస్ పాస్ ఛార్జీలను కూడా ఆర్టీసీ పెంచింది. దాదాపు 20 శాతానికిపైగా ఛార్జీలను పెంచేసింది. కాగా ఇప్పటివరకు రూ. 1150గా ఉన్న సిటీ ఆర్డీనరి పాస్ ధర తాజాగా రూ. 1400కి చేరింది. ఇక రూ. 1300 గా ఉన్న మెట్రో […]
Telangana: హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాలు సహా.. తెలంగాణలో ఆషాడ బోనాలకు సమయం ఆసన్నమైంది. ఈనెల 26 నుంచి ఆషాడ బోనాల వేడుకలు షురూ కానున్నాయి. ఆషాడ మాసం నెలరోజులపాటు బోనాల పండుగ జరగనుంది. కాగా తొలుత గోల్కొండ కోటలో కొలువైన జగదాంబ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించడంతో బోనాల జాతర ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ లోని 28 ప్ముఖ ఆలాయాల్లో ఆషాడ బోనాల పండుగ జరగనుంది. దీంతో దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు, జాతరకు […]
Kacheguda Railway Station: వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన కాచిగూడ రైల్వేస్టేషన్ ను ప్రభుత్వం మరింతగా అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగానే రూ. 2.23 కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన లైటింగ్ సిస్టమ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. నేడు సాయంత్రం 5.30 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ లైటింగ్ సిస్టమ్ ప్రారంభిస్తారు. ఈ రైల్వేస్టేషన్ కు విజువల్ హైలెట్ గా, వారసత్వ చిహ్నంగా మార్చేందుకు జాతీయతను ప్రతిబింబించే థీమ్ తో […]
BRS: బీఆర్ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూశారు. నాలుగు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సహా.. పలువురు రాజకీయ నేతలు, కార్యకర్తలు ఆయనకు సంతాపం ప్రకటించారు. కాగా మాగంటి గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2018, 2023 […]
Hyderabad: చేప ప్రసాదం పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయాసం, ఉబ్బసం ఉన్న వారికి బత్తిని కుటుంబ సభ్యులు ఇచ్చే చేప ప్రసాదాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నేడు, రేపు పంపిణీ చేయనున్నారు. అందుకోసం ఆర్ అండ్ బీ అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే జీహెచ్ఎంసీ అధికారులు పారిశుద్ధ్య ఏర్పాట్లతో పాటు మొబైల్ టాయిలెట్ల ఏర్పాట్లు, తాగునీటి ఏర్పాట్లు చేశారు. ఇక రెవెన్యూ డిపార్ట్ మెంట్ రోగుల సహాయార్ధం హెల్ప్ కౌంటర్ […]
AIG Hospital: హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రి ఎదురుగా పార్క్ చేసిన అంబులెన్స్ లో మంటలు చెలరేగి ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వ్యాపించాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సకాలంలో ఫైర్ సిబ్బంది ఆస్పత్రికి చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రిలో మంటలు చెలరేగడంతో రోగులు ఆందోళన చెందారు. అగ్నిప్రమాదం ఘటనతో ఏఐజీ ఆస్పత్రి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ […]
MLA Gopinath: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్.. ఎమ్మెల్యే గోపినాథ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి గోపినాథ్ ఆరోగ్యంపై ఆరా తీశారు. వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కాగా […]