MLA Gopinath: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత.. పలువురి సంతాపం
BRS: బీఆర్ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూశారు. నాలుగు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సహా.. పలువురు రాజకీయ నేతలు, కార్యకర్తలు ఆయనకు సంతాపం ప్రకటించారు. కాగా మాగంటి గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2018, 2023 లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983 టీడీపీ ఆవిర్భావంతోనే మాగంటి గోపీనాథ్ రాజకీయాల్లోకి వచ్చారు.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మరోవైపు గోపీనాథ్ మృతిపట్ల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన స్నేహితుడిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని ఆవేదన చెందారు.