Jammu: పాకిస్తాన్ దాడుల్లో ఇండ్లు కోల్పోయిన జమ్మూ ప్రజలు!

Jammu: పహల్గాం దాడి తర్వాత పాక్ ఉగ్ర శిభిరాలపై భారత్ తీవ్రంగా విరుచుకుపడింది. పాకిస్తాన్ లోని ఉగ్ర శిభిరాలను ద్వంసం చేసింది. దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్ భారత్ భూభాగంపై డ్రోన్ లతో దాడిచేసింది. అయితే నియంత్రణ, ప్లానింగ్ లేకుండా డ్రోన్ లను ప్రయోగించడంతో జమ్మూలోని సామాన్య ప్రజల ఆస్తులు ద్వంసం అయ్యాయి. ఆర్మీపై దాడులు చేయాల్సిందిపోయి సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుంది. దీంతో స్థానికుల ఇళ్లు ద్వంసం అయ్యాయి.
దాడుల నేపథ్యంలో ఉరి ప్రాంతంలోని పలు గ్రామాల ప్రజలు ఇళ్ళు, ఆస్తులు కొల్పొయి రోడ్డున పడ్డారు. ప్రస్తుతం వారంతా పలు ప్రాంతాల్లో తాత్కలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం నుంచి తమకు సహాయం కావాలని బాధిత ప్రజలు కొరుతున్నారు. తమకు బంకర్లు ఏర్పాటు చేసి నివాసం కల్పించాలని డిమండ్ చేస్తున్నారు. సరిహద్ధు ప్రాంతమైన లగామా గ్రామంలో దాదాపు 4 వందలకు పైగా జీవనం కొనసాగిస్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా ఉంటున్న తమను ఏ నాయకుడు కానీ, ఏ అధికారి కానీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి చిన్న విషయానికి కూడా పాక్ తమ గ్రామంపై దాడి చేస్తుందన్నారు.

pakistan shelling hit people homes in jammu (2)
జమ్మూలోని లగామా, బటాంగ అనే గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా మారింది. కొంత దూరంలో పడిన బాంబుల దాటికి పలు ఇళ్ళు నాశనమయ్యాయి. ఇటీవల దాడిలో ఇంతవరకు 9 బాంబులు పడడంతో ఊరు మొత్తం ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. స్థానికంగా బంకర్లు ఏర్పాటు చేస్తే తాము క్షేమంగా ఉండగలమని స్థానికులు చెబుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్నభయంతో బతకాల్సి వస్తుంటున్నారు.

pakistan shelling hit people homes in jammu (3)
జమ్మూలోని ఉరి ప్రాంతంలో డ్రోన్దాడులు చోటుచేసుకున్నాయి. స్థానికంగా ఉన్న బాండి మార్కెట్లో 10 వ తేదీన రాత్రి కొండపై బ్లాస్టింగ్ దాడులు జరిగాయి. బ్లాస్టింగ్లో మార్కెట్ మొత్తం ధ్వంసం అయింది. ఈ దాడుల్లో చిరు వ్యాపారులు తమ జీవన విధానాన్ని కోల్పోయారు. అలాగే వ్యాపారస్థులు కుటుంబాలతో ప్రాంతం వదిలి వలస వెళ్లిపోయిన పరిస్థితి ఏర్పడింది. దాడిలో దాదాపు 15 షాపులు ధ్వంసం అవ్వడంతో ప్రభుత్వం నుంచి పరిహారం కోరుతున్నారు.

pakistan shelling hit people homes in jammu (4)