Pakistan: యుద్ధ భయంతో హాస్పిటల్ లో చేరిన పాకిస్థాన్ పీఎం!

Pakistan: ఒక్క తూటా పేల్చకముందే పాకిస్థాన్ గడగడలాడుతోంది. పాకిస్థాన్ ప్రధాని షెహనాజ్ షరీఫ్ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే భారత్తో కాళ్ల బేరానికి వచ్చింది. అందుకు భారత్ స్పందించకపోవడంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కనిపించకుండా పోయారు. తాజాగా ఆ దేశ ప్రధాని హెహబాజ్ షరీఫ్ ఆస్పత్రిలో చేరారు. రావల్సిండిలోని కంబైన్డ్ మిలటరీ హాస్పిటల్లో ప్రధానమంత్రికి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా పాకిస్తాన్ ప్రభుత్వం ధృవీకరించలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పాకిస్తాన్ ప్రధాని కార్యాలయం లేఖ చక్కర్లు కొడుతోంది.
పాకిస్తాన్ను చూస్తుంటే ఆరంభశూరత్వం నానుడి గుర్తుకొస్తోంది. ప్రారంభంలో చేసిన హడావుడి చివరి దాకా కొనసాగించలేకపోతోంది. యుద్ధానికి సై అంటూ ప్రగల్బాలు పలికిన ఆసిప్ మునీర్ ప్రస్తుతం అడ్రస్ లేకుండా పోయాడు. పాక్ సైనికులే తిరుగుబాటు చేస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం 4వేల500 మంది సైనికులు 250 సైనికాధికారులు ఉద్యోగాలకు రాజీనామా చేసి తమ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటున్నారు.
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత బలగాలు అప్రమత్తమయ్యాయి. రైల్వేస్టేషన్లలో భద్రత కట్టుదిట్టం చేశారు. వరంగల్ రైల్వేస్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. రైళ్లలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పేలుడు పదార్థాలు, మండే స్వభావం కలిగిన వస్తువులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగి వారం రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో మరిన్ని దాడులు జరగొచ్చని నిఘావర్గాల హెచ్చరించాయి.