Published On:

Pakistan: పాకిస్తాన్ ఆర్మీలో ఆయుధ సంక్షోభం.! యుద్ధం వస్తే నాలుగు రోజులకే ఆలవుట్.!

Pakistan: పాకిస్తాన్ ఆర్మీలో ఆయుధ సంక్షోభం.! యుద్ధం వస్తే నాలుగు రోజులకే ఆలవుట్.!

Pakistan: తినడానికి తిండి లేని దేశం, రాత్రయితే కరెంటు ఉండని దేశం, భారత్ పై యుద్ధానికి కాలుదువ్వుతోంది. యుద్ధం వస్తే ట్యాంకులలో డీజీల్ కూడా లేక అవస్థలు పడుతోంది. డీజిల్ సమకూర్చుకోవడానికి పౌరుల వాహనాలనుంచి అక్రమంగా తీసుకొంటుంది. కీలకమైన ఫిరంగి మందుగుండు సామాగ్రి కొరత పాకిస్థాన్ కు ఉంది. ఒక రకంగా పాక్ ఆర్మీలో ఆయుధ సంక్షోభం నెలకొంది. 4 రోజులకు సరిపడా ఆయుధాలు మాత్రమే ఉన్నాయి. ఆతర్వాత భారత్‌కు పాకిస్థాన్ సరెండర్ అయ్యే అవకాశాలే ఎక్కువ. ఇప్పటికే ఆయుధాలు, మందు గుండు కోసం చైనాను వేడుకుంటోంది. యుద్ధ ట్యాంకులకు డీజిల్ కూడా లేని పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం మాత్రం మానడం లేదు.

 

మల్టిపుల్ రాకెట్ లాంచర్లు, ఎస్ హెచ్ 15గన్స్‌కు మందు గుండు పాకిస్థాన్ దగ్గర కరువయ్యాయి. డీజిల్ కోసం పౌరులపై పాక్ ఆర్మీ ఆధారపడింది. భారీ వాహనాల్లో ఉన్న డీజిల్‌ను తీసి పంపాలని  ఆదేశించింది. పౌరుల వాహనాల నుంచి ఆర్మీ సిబ్బంది డీజిల్ తీసుకెళుతున్నారు. ఇందుకు, ఐజీలకు పాకిస్తాన్ ఆర్మీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ కసీఫ్ అబ్దుల్లా ఆదేశాలిచ్చారు.

 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైనిక చర్యను ప్రారంభిస్తుందని పాకిస్థాన్ భయంతో వణుకుతోంది. పాకిస్థాన్ వద్ద ఉన్న మందుగుండు సామాగ్రి, అధికంగా 96గంటల వరకు వస్తాయి. ఆతర్వాత లొంగుబాటు తప్పదని యుద్ధ నిపుణులు భావిస్తున్నారు. భారత్ ను యుద్ధరంగంలో ఎదుర్కోవడానికి పాకిస్థాన్ వద్ద M109 హోవిట్జర్లకు తగినంత 155mm షెల్స్ లేదా దాని BM-21 వ్యవస్థలకు 122mm రాకెట్లు లేవు.

 

ముఖ్యమైన మందుగుండు సామగ్రి లేకపోవడంపై పాకిస్తాన్ రక్షణ శాఖ తీవ్ర  భయాందోళనలో ఉంది. పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా సైన్యం ఎదుర్కొంటున్న సవాళ్లను అంగీకరించారు. దీర్ఘకాలిక యుద్ధం జరిగినప్పుడు మందుగుండు సామగ్రి, ఆర్థిక బలం లేదన్నారు.