Published On:

Pahalgam: స్లీపర్‌ సెల్స్‌ యాక్టీవ్ అయ్యాయన్న నిఘావర్గాలు

Pahalgam: స్లీపర్‌ సెల్స్‌ యాక్టీవ్ అయ్యాయన్న నిఘావర్గాలు

Pahalgam: పహల్గామ్‌ ఉగ్రదాడికి వారం రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో మరిన్ని దాడులు జరగొచ్చని నిఘావర్గాలు హెచ్చరించాయి. స్లీపర్‌ సెల్స్‌ యాక్టీవ్ అయ్యారంటూ బలగాలు తెలిపాయి. కాశ్మీర్‌ లోయలో 87 టూరిస్ట్‌ ప్రదేశాల్లో 48 ప్లేసులను క్లోజ్‌ చేశారు. అదనపు భద్రత కల్పించిన తర్వాతే వాటిని రి ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాతే అన్ని చోట్లకు పర్యాటకులను అనుమతిస్తామన్నారు. ఉగ్రదాడి నిందితుల కోసం భద్రతాబలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి. బైసరన్‌ లోయలో ఉగ్రవాదుల కదలికలపై డేటా సేకరణ జరుగుతోంది.

 

ఉగ్రదాడి జరగడానికి ముందు రెక్కీ నిర్వహించారు టెర్రరిస్టులు. పర్యాటకుల నుంచి సేకరించిన వీడియోలు, ఫొటోల ద్వారా వారి ఆచూకీని గుర్తిస్తున్నారు. ఉగ్రదాదులు బైసరన్‌ లోయకు ఏమార్గంలో, ఎక్కడ నుంచి, ఎలా చేరుకున్నారనే దానిపై ఎంకైరీ జరుగుతోంది. ఇప్పటికే ఉగ్రదాడికి పాల్పడ్డ వారి ఇళ్లను కూల్చేసారు. బైసరన్‌ లోయలో ఉగ్రమూకల స్థావరాలను టార్గెట్‌ చేస్తూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి.

 

పహల్గామ్‌ ఉగ్రదాడి దర్యాప్తును ముమ్మరం చేసింది NIA. బైసరన్‌ వ్యాలీలో సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ చేస్తున్నారు అధికారులు. జిప్‌లైన్‌ ఆపరేటర్లు, స్థానికులను ప్రశ్నిస్తున్నారు. రిషి భట్‌ అనే పర్యాటకుని సెల్ఫీ వీడియోలో కనిపించిన జిప్‌లైన్‌ ఆపరేటర్‌పై ఫోకస్‌ పెట్టారు. మరోవైపు ఉగ్రదాడి వీడియో నుంచి సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. టూరిస్టుల వాగ్మూలం సేకరించేందుకు వారి సొంతూళ్లకు వెళుతున్నాయి NIA బృందాలు.

 

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 42 టెర్రరిస్ట్ స్థావరాల గుర్తించారు. పీవోకెను అడ్డాగా చేసుకొని పాకిస్తాన్ టెర్రరిస్ట్ కార్యకలాపాలను చేస్తుంది.  దీంతో పీవోకే వైపు దూసుకుపోతున్నాయి  బలగాలు. దిక్కుతోచని స్థితిలో పీవోకే నుంచి టెర్రరిస్ట్ స్థావరాలను పాకిస్తాన్  ఖాళీ చేయిస్తుంది . ఆర్మీ బంకర్లలో టెర్రరిస్ట్‌లకు ఆశ్రయం కల్పిస్తోంది. తమపై దాడి చేస్తే దీటుగా బదులిస్తామంటున్న పాక్ బెదిరింపులను లెక్కచేయకుండా ముందుకు దూసెకెళ్తోంది భారత్‌.