Operation Sindoor: నామరూపాలు లేకుండా పొయిన జైషే మహ్మద్.. అజర్ కుటుంబంలో 14 మంది హతం!

10 family members Killed in Operation Sindoor: ఆపరేషన్ సింధూర్తో జైషే మహ్మద్ నామరూపాలు లేకుండా పోయింది. మసూద్ అజర్ కుటుంబంలో 14 మంది హతమయ్యారు. నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేదంటూ మజూద్ అజర్ ఏడిచేస్తున్నాడు. మోదీపై విషం కక్కుతూ మసూద్ లేఖ విడుదల చేశాడు.
ప్రధాని మోదీ అన్ని నియమాలు ఉల్లంఘించారంటూ ఆక్రోశం చూపించారు. మిసైళ్ల దాడిలో మసూద్ బహానల్ పూర్ డెన్ నేలమట్టం అయింది. ఇందులో జైషే మహ్మద్ చీఫ్ కుటుంబం సహా నలుగురు సన్నిహితులు హతమయ్యారు.
భారత్పై ప్రతీకారం తీర్చుకుంటామని మసూద్ లేఖ విడుదల చేశాడు. ఇకపై భారత్పై జాలి చూపను అంటూ మసూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భయం లేదు.. నిరాశ లేదు.. దుఖం లేదు అంటూ లేఖ రాశారు.
భారత్ చేసిన దాడుల్లో మసూద్ అజార్ సోదరితో పాటు ఆమె భర్త, మసూద్ మేనల్లుడు, అతడి భార్య, మేనకోడలు, ఐదుగురు చిన్నారులు మృతి చెందినట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.