Published On:

Mecca: మక్కాకు తీవ్రవాదుల టెన్షన్.! ప్రమాదం ఉందన్న సౌదీ

Mecca: మక్కాకు తీవ్రవాదుల టెన్షన్.! ప్రమాదం ఉందన్న సౌదీ

Mecca: ప్రపంచవ్యాప్తంగా దేవుళ్లకు కూడ భద్రత కరువైంది. మన దేశంలో దేవాలయాల చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం మనం తరచూ చూస్తూ ఉంటాం. ఇక అసలు విషయానికి వస్తే ముస్లింలకు అత్యంత పవిత్ర స్థలమైన మక్కాలో కూడా టెర్రర్‌ దాడులకు అవకాశం ఉందని సౌదీ ప్రభుత్వం భావిస్తోంది.

 

ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు .. మక్కాను దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటుంటారు. పుట్టిన ప్రతి ఒక్క ముస్లిం తన జీవితంలో ఒక్కసారైనా.. మక్కాను దర్శించుకోవాలనుకుంటాడు. ప్రతి ఏడాది సుమారు 20 లక్షలమంది మక్కాను సందర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ప్రస్తుతం హజ్‌ తీర్థయాత్రికులతో పాటు మక్కాకు కూడా ప్రమాదం పొంచి ఉందని సౌదీ అరేబియా ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అమెరికాకు చెందిన పేట్రియాట్‌ మిస్సైల్స్‌ సిస్టమ్‌ను మక్కా వద్ద ఏర్పాటు చేసింది. ఇది చూడ్డానికి వచ్చే భక్తులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

ఇవి కూడా చదవండి: