Covid-19: దేశంలో కరోనా జోరు.. ఒక్కరోజులోనే 564 కేసుల రికార్డ్

Corona Virus Spreading: దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. రోజురోజుకు కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 564 కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. దీంతో దేశంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 5 వేలకు చేరువైంది.
కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం నిన్న ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 564 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 4 866 కి చేరింది. కాగా ప్రస్తుతం నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో 1487 కేసులు ఉండగా, ఢిల్లీ 562, వెస్ట్ బెంగాల్ 538, మహారాష్ట్ర 526, గుజరాత్ 508, కర్ణాటక 436, తమిళనాడు 213 కేసులు నమోదయ్యాయి.
మరోవైపు దేశంలో కరోనాతో మృతిచెందుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో ఏడుగురు మరణించారు. ఢిల్లీలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు, మహారాష్ట్రలో ముగ్గురు కరోనాతో చనిపోయారు. దీంతో ఈ ఏడాది కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 51కి చేరింది.